Share News

Amaravati Re Launch: దారులన్నీ అమరావతి వైపే.. పెద్ద సంఖ్యలో జనం రాక

ABN , Publish Date - May 02 , 2025 | 11:02 AM

Amaravati Re Launch: అమరావతి పున:ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే వందల బస్సుల్లో ప్రజలు అమరావతి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.

Amaravati Re Launch: దారులన్నీ అమరావతి వైపే.. పెద్ద సంఖ్యలో జనం రాక
Amaravati Re Launch

విజయవాడ, మే 2: అమరావతి పున:ప్రారంభోత్సవ (Amaravati re inauguration) కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. దూర బారాల నుంచి సభకు వస్తున్న వారికి కలెక్టర్ లక్ష్మీ శా కావాల్సిన సౌకర్యాలు చూస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి మానిటర్ చేస్తున్నారు. ప్రధాన మంత్రి మోదీ (PM Narendra Modi) రాకతో నగరంలోని ట్రాఫిక్ మళ్లింపులు జరిగాయి. ఈ ఒక్కరోజు అవసరాన్ని బట్టి విజయవాడ నగరవాసులు బయటికి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అన్ని మండలాల నుంచి ఎన్ని బస్సులు బయలుదేరాయని, వచ్చిన వారికి భోజన సౌకర్యాలు, పార్కింగ్ ఫెసిలిటీలు లక్ష్మీశా కల్పిస్తున్నారు. మండలాల నుంచి బయలుదేరుతున్న బస్సుల వద్దకే టిఫిన్, భోజన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి 450 బస్సులు బయలుదేరాయని.. కేవలం పార్కింగ్ కోసమే 350 ఎకరాలు కేటాయించామని కలెక్టర్ లక్ష్మీ శా వెల్లడించారు.


అటు పశ్చిమగోదావరి జిల్లా నుంచి కూడా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి జనం తరలివెళ్తున్నారు. భీమవరం పాత బస్టాండ్‌లో జనం తరలి వెళ్తున్న బస్సులను జిల్లా కలెక్టర్ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో 150 బస్సుల్లో సుమారు 8000 మంది అమరావతి తరలివెళ్తున్నారు. 150 బస్సులు ఏర్పాటు చేసిన ఇంకా ఎక్కువ మంది జనం వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని.. బస్సుల్లో వెళ్తున్న వారికి అన్ని సదుపాయాలతో పాటు, ఒక కోఆర్డినేటర్ మహిళా పోలీస్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. సభను విజయవంతం చేయడానికి ప్రజలందరూ తరలి వెళ్తున్నారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి


ఇవి కూడా చదవండి

Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

CM Chandrababu: ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం..



Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:56 PM