Somireddy Chandramohan Reddy: మద్యం కేసుతో జగన్కు నిద్ర పట్టడం లేదు
ABN , Publish Date - May 23 , 2025 | 05:44 AM
మద్యం స్కాంలో ఆరోపణలు వెల్లువెత్తుతుండగా జగన్కు నిద్ర లేకుండా పోయిందని టీడీపీ వ్యాఖ్యానించింది. అబద్ధాలను పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శలు వచ్చాయి.

99 పైసలకే భూములిచ్చామని నిరూపిస్తావా.. రాజీనామా చేస్తావా?
సోమిరెడ్డి, ఆనంద్బాబు
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): మద్యం అక్రమాల్లో దోషులు జైలుపాలవుతుంటే జగన్రెడ్డికి నిద్ర పట్టడం లేదని, అబద్ధాలను పదే పదే చెప్పడం ద్వారా వాటిని ప్రజలు నమ్ముతారనుకోవడం జగన్ పిచ్చితనమని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నక్కా ఆనంద్బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ మాటల్లో ఒక్కటీ నిజం లేదు. గ్రోత్ రేట్కు అర్ధం తెలియని జగన్రెడ్డి.. రాష్ట్రంలో గ్రోత్ రేట్ దారుణంగా పడిపోయిందని చెప్పడం సిగ్గుచేటు. ఉర్సాకు 99 పైసలకే భూములిచ్చామన్న జగన్.. దాన్ని నిరూపించాలి, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’ అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. నక్కా ఆనంద్బాబు మాట్లాడుతూ నిన్నటి దాకా జగన్ పంచనే ఉన్న విజయసాయిరెడ్డి.. టీడీపీ వాడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు.