Share News

Jagans Power Deal: యాక్సిస్‌పై యాగీ

ABN , Publish Date - May 07 , 2025 | 03:36 AM

జగన్‌ హయాంలో యాక్సిస్‌తో రూ.5.12కి ఒప్పందం కుదిరింది, బాబు సర్కార్‌ దీనిని రూ.4.60కి తగ్గించింది. జగన్‌ రోత పత్రిక మాత్రం ఈ నిజాలు దాచేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది

Jagans Power Deal: యాక్సిస్‌పై యాగీ

జగన్‌ రోత పత్రికలో నిజాలు దాచి నిస్సిగ్గు రాతలు

  • నాడు ఒప్పందం చేసుకుంది జగనే

  • 2022లో యూనిట్‌ రూ.5.12కు ఒప్పందం

  • దీనిని రూ.4.60కు తగ్గించిన బాబు సర్కార్‌

  • వైసీపీ ఒప్పందంతో పోలిస్తే 52 పైసలు ఆదా

  • జీఎస్టీ కింద ఏటా మరో రూ.784 కోట్లు మిగులు

  • కీలక అంశాలు దాచిపెట్టి.. రోత పత్రిక రాతలు

  • నాటి సెకీ ఒప్పందంపై వైసీపీ అడ్డగోలు వాదన

  • అప్పట్లో యూనిట్‌ రూ.2.49కే కొన్నామని కథలు

  • కానీ ట్రాన్స్‌మిషన్‌ చార్జీల పేరిట దోపిడీపై గోప్యత

  • ద్వంద్వ ప్రమాణాలపై విద్యుత్‌ నిపుణుల మండిపాటు

వైసీపీ హయాంలో యూనిట్‌ విద్యుత్‌ను రూ.5.12కు కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీనిని చంద్రబాబు ప్రభుత్వం రూ.4.60కు తగ్గించి కొనుగోలుకు సిద్ధమైంది. ఇది లాభమా? నష్టమా? అంటే.. చిన్నపాటి అక్షరజ్ఞానం ఉన్న వ్యక్తి కూడా లాభమేనని ఠక్కున చెబుతాడు. కానీ, జగన్‌ రోత పత్రికకు మాత్రం ‘నిజాలు’ కనిపించడం లేదు. యాక్సిస్‌ ఒప్పందంపై రోత రాతలతో యాగీ చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది. నిజాలు తెలిసిన వారు నవ్విపోయినా.. సిగ్గులేదన్నట్టుగా రెచ్చిపోతోంది.


అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలపై జగన్‌ రోత పత్రిక నిస్సిగ్గు రాతలతో రెచ్చిపోతోంది. నాడు వైసీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలకు మసిపూసి మారేడు చేస్తూ.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై రోత రాతలు రాస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. యాక్సిస్‌తో తాజాగా చేసుకున్న ఒప్పందంపైనా యాగీ చేస్తూ.. నాడు జగన్‌ చేసుకున్న ఒప్పందాలే మేలని బుకాయిస్తోంది. నిజానికి 2022లో అప్పటి సీఎంగా జగనే యాక్సిస్‌తో విద్యుత్‌ ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో యూనిట్‌కు రూ.5.12 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదిరింది. కానీ.. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక.. దీనిని రూ.4.60కు తగ్గించి కొనుగోలుకు సిద్ధమైంది. దీంతో ఒక్కొక్క యూనిట్‌ విద్యుత్‌పై రూ.0.52 పైసలు చొప్పున తగ్గనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా వినియోగదారులకు ఇది మేలు చేయనుంది. అయినప్పటికీ ఈ నిజాన్ని దాచిపెట్టిన జగన్‌ రోత పత్రిక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పబ్బంగడుపుకొనే ప్రయత్నం చేస్తోంది.


అసలేం జరిగింది?

2022లో జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాక్సిస్‌ సంస్థ నుంచి యూనిట్‌కు రూ.5.12 చొప్పున కరెంటును కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కానీ, సంస్థ యూ నిట్‌ సిద్ధంగా లేకపోవడంతో విద్యుత్‌ను తీసుకోలే దు. అనంతరం.. యాక్సిస్‌ సంస్థ బిల్డింగ్‌, బ్యాలెన్సిం గ్‌, బ్యాంకింగ్‌(బీబీబీ) విధానంలో 400 మెగావాట తో కూడిన సౌర విద్యుత్‌ ప్లాంటును ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌ యాక్సిస్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం తర్వాత ప్రజాభిప్రాయ సేకరణతో పాటు విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)లో విచారణ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 2న యాక్సిస్‌ నుంచి యూనిట్‌కు రూ.4.60 చొప్పున విద్యుత్‌ను కొనాలని ఏపీఎస్పీడీసీఎల్‌ను ఈఆర్‌సీ ఆదేశించింది. దీనిపైనే జగన్‌ రోత పత్రిక యాగీ ప్రారంభించింది. కానీ, వాసవం మాత్రం.. 2022లో జగన్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు యూనిట్‌కు రూ.5.12 కంటే.. తాజాగా ఈఆర్‌సీ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.4.60 చొప్పున విద్యుత్‌ కొంటున్నారు. దీంతో ఒక్కొక్క యూనిట్‌పై రూ.0.52 పైసలు చొప్పున భారం తగ్గనుంది. లక్షల యూనిట్లతో పోల్చి చూస్తే.. ప్రభుత్వానికి రూ.కోట్లలో లబ్ధి చేకూర్చనుంది. ఈ విషయం తెలిసి కూడా జగన్‌ పత్రిక మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండడంపై నిపుణులు విస్తుపోతున్నారు.


తాజా ప్రయోజనాలు ఇవీ..

  • యాక్సిస్‌తోయూనిట్‌ విద్యుత్‌రూ.4.60కే రానుంది.

  • 25 ఏళ్లలో రూ.2719.45 కోట్ల భారం తగ్గనుంది.

  • 2,091 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి కానుంది.

  • ఏటా రూ.794 కోట్లు రాష్ట్రానికి ఆదాయం.

  • యాక్సిస్‌ సంస్థను రాష్ట్రాలో ఏర్పాటు చేయడంతో ట్రాన్స్‌మిషన్‌ సర్వీస్‌ చార్జీలు వర్తించవు.

  • ఎస్‌జీఎస్టీ కింద రూ.731 కోట్ల రాబడి.

  • సేకరించే భూమికి ఎకరాకు ఏటా రూ.31,000 కౌలు ఆదాయం.

  • రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి చాన్స్‌.

  • యాక్సిస్‌లో విండ్‌, సోలార్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ విధానం.

  • ఉదయం, రాత్రి, పీక్‌ అవర్‌లో విద్యుత్‌ పుష్కలం. జగన్‌ ఒప్పందం కొనసాగిస్తే..

  • యాక్సిస్‌తో జగన్‌ చేసుకున్న ఒప్పందం కొనసాగిస్తే యూనిట్‌ను రూ.5.12 చొప్పున కొనాలి.

  • ఏటా రూ.108.78 కోట్ల మేర భారం ఖాయం.

  • మొత్తం 25 ఏళ్లలో రూ.2719.45 కోట్ల మేర ప్రజలపై బాదుడు.


‘జగన్మాయ’ ఇదీ..

  • గడచిన రెండు రోజులుగా జగన్‌ రోత పత్రికలో రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు చేసుకున్న కొనుగోలు ఒప్పందాలపై గగ్గోలు పెడుతున్నా.. జగన్‌ హయాంలో ఒప్పందం ధర యూనిట్‌ రూ.5.12గా ఉందని చెప్పడం లేదు.

  • సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఇఫ్‌ ఇండియా(సెకీ)తో చేసుకున్న 7000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని యూనిట్‌ రూ.2.49కే చేశామని చెబుతున్నారు. కానీ.. సెకీ ప్లాంట్‌ రాజస్ధాన్‌లో ఉంది. అక్కడ నుంచి రాష్ట్రానికి విద్యుత్తు సరఫరా కావాలంటే.. ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సేవల చార్జీలు(ఐఎస్‌టీఎస్‌) పడతాయి. ఈ చార్జీలు యూనిట్‌కు రూ.3.10 దాకా ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా జగన్‌ పత్రిక దాచేసింది.

  • ఇక, నేరుగా విద్యుత్తు ఉత్పత్తి చేయని సెకీ.. సౌర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసి, రాష్ట్రానికి సరఫరా చేస్తుంది. దీనికిగాను యూనిట్‌కు 7 పైసల కమీషన్‌ తీసుకుంటుంది.

  • సెకీతో ఒప్పందం మేరకు ఒక యూనిట్‌ విద్యుత్‌ రూ.5.66కు చేరుతుంది. దీనిలో యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49, 7 పైసల కమీషన్‌, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు రూ.3,10 ఉంటాయి.

  • అంటే.. యాక్సిస్‌తో పోల్చితే.. సెకీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌ యూనిట్‌కు రూ.1.06 ఎక్కువే. అయినా.. జగన్‌ పత్రిక మాత్రం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది.

  • ప్లాంటు రాజస్థాన్‌లో ఉండటంతో యువతకు ఉపాధి అవకాశాలు దక్కవు. ఏపీకి జీఎస్టీ రాదు.

  • 2021 డిసెంబరు 1 నుంచి ఇప్పటిదాకా యూనిట్‌ రూ.2.49కే సెకీ నుంచి కొన్నానని జగన్‌ చెబుతారు. కానీ.. ఇప్పటిదాకా ఈ ఒప్పందం అమలు కాలేదు.

  • సెకీ నుంచి ఒక్క యూనిట్‌ కరెంటు కూడా రాష్ట్రానికి రాలేదు. కారణం... సెకీ విద్యుత్తును సేకరించలేకపోవడమే. ఇలా ఎందుకు జరిగిందో జగన్‌ చెప్పరు. జగన్‌ పత్రిక రాయదు. ఇదే.. జగన్మాయ!!.


ఈ వార్తలు కూడా చదవండి..

PAN Card: పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..

Security Mock Drill: హైదరాబాద్‌లోని ఆ నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్.. ఎప్పుడంటే..

India - Pakistan war: యుద్ధానికి సిద్ధమా.. తర్వాత పరిస్థితి ఏమిటి

Minister Satya Kumar: వైద్యులపై హెల్త్ మినిస్టర్‌కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం

CM Chandrababu: ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

For Andhrapradesh News And Telugu News

Updated Date - May 07 , 2025 | 03:36 AM