Gukesh:గుకేష్కు ప్రధాని, సీఎం చంద్రబాబు అభినందనలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 09:47 PM
నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2025లో ఘన విజయం సాధించిన తెలుగు తేజం గుకేష్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు నాయుడు గుకేష్కు కంగ్రాట్స్ చెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్: నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2025లో ఘన విజయం సాధించిన తెలుగు తేజం గుకేష్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు నాయుడు గుకేష్కు కంగ్రాట్స్ చెప్పారు. గుకేష్ అసాధారణ, అత్యుత్తమ విజయం సాధించినందుకు అభినందనలు.. అని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం 'ఎక్స్'లో ఛాంపియన్ గుకేష్కు విషెస్ చెప్పారు. నార్వే చెస్ చాంపియన్ షిప్ 2025 పోటీ 6వ రౌండ్లో వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్పై గుకేష్ విజయం అతని ప్రతిభ, అంకితభావాన్ని తెలియచెబుతుందని మోదీ అన్నారు. గుకేష్కు ఇలాంటి మరిన్ని అద్భుత విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నానని మోదీ ఆకాంక్షించారు.
అటు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా గుకేష్కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్పై చారిత్రాత్మక విజయం సాధించిన గుకేష్కు హృదయపూర్వక అభినందనలు. ఈ అద్భుతమైన విజయం అతని ప్రతిభ, ప్రశాంతతను తెలియచేస్తుందని చంద్రబాబు అన్నారు. భారత చెస్ క్రీడారంగంలో గోకేష్ విజయం స్పూర్తిదాయకమన్న చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్లోని మన ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. వాళ్లు ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించే దిశగా ప్రోత్సహిస్తూనే ఉంటామని చంద్రబాబు అన్నారు.
ఇలా ఉండగా, ప్రస్తుత మన ఛాంపియన్.. గుకేశ్ దొమ్మరాజు 2006 మే 29న తమిళనాడులోని చెన్నైలో తెలుగు కుటుంబంలో పుట్టాడు. అతని పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వాళ్లు. గుకేష్ తండ్రి, రజనీకాంత్ సర్జన్ కాగా, తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. గుకేష్ ఏడేళ్ల వయసులో చెస్ ఆడటం నేర్చుకున్నాడు. చెన్నైలోని మేల్ అయనంబాక్కంలోని వేలమ్మాళ్ విద్యాలయలో చదువుకున్నాడు.
ఇవీ చదవండి:
ఐదేళ్ల క్రితం స్టాక్ ధర రూ.129, ఇప్పుడు రూ.1679
ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి