APPSC: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్
ABN , Publish Date - Jul 14 , 2025 | 08:26 PM
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు జులై 16న ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. ఆగస్టు 5వ తేదీ ఈ దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు అని స్పష్టం చేసింది.

అమరావతి, జులై 14: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇవాళ(సోమవారం) ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ శాఖలో జనరల్, లిమిటెడ్ రిక్రూట్మెంట్కు సంబంధించి 691 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 16 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5వ తేదీ ఆఖరు అని స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం http://PSC.ap.gov.inలో సైట్ ను చూడాలని ఏపీపీఎస్సీ తెలిపింది.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం.. ఎక్స్ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
Read Latest AP News And Telugu News