Share News

Fee Reimbursement: ఆ ఫీజులు ఎవరి ఖాతాల్లోకి

ABN , Publish Date - Jun 15 , 2025 | 06:57 AM

ఉన్నత విద్య ఫీజుల విడుదల విషయంలో కొత్త సమస్య ఉత్పన్నమైంది. కాలేజీలకు బదులుగా తల్లిదండ్రుల కు ఫీజులు జమచేసే విధానాన్ని గత వైసీపీ ప్రభు త్వం ప్రవేశపెట్టడం దీనికి కారణం.

Fee Reimbursement: ఆ ఫీజులు ఎవరి ఖాతాల్లోకి

  • 2023-24 ఉన్నత విద్య ఫీజుల జమపై సందిగ్ధత

  • వైసీపీ హయాంలో మూడు క్వార్టర్లు బకాయి

  • దీంతో విద్యార్థుల నుంచే కట్టించుకున్న కాలేజీలు

  • కొన్ని కాలేజీలకు మాత్రం వసూలు కాని వైనం

  • ఆ ఫీజులు ఇప్పుడు ఎవరి ఖాతాల్లో వేయాలి?

  • చెల్లింపుల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం

అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య ఫీజుల విడుదల విషయంలో కొత్త సమస్య ఉత్పన్నమైంది. కాలేజీలకు బదులుగా తల్లిదండ్రుల కు ఫీజులు జమచేసే విధానాన్ని గత వైసీపీ ప్రభు త్వం ప్రవేశపెట్టడం దీనికి కారణం. 2023-24 విద్యా సంవత్సరంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం 3 క్వార్టర్ల ఫీజులు రూ.1800 కోట్లు మేర బకాయి పెట్టింది. దీం తో యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపేశాయి. చాలా కాలేజీలు మీరే ఫీజులు కట్టాలని డిమాండ్‌ చేశాయి. దీంతో చాలా వరకు విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకున్న పరిస్థితి. అయితే కాలేజీలకే ఫీజులు చెల్లిస్తామని, సర్టిఫికెట్ల విషయం లో విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని కూటమి ప్రభు త్వం కాలేజీలకు హామీ ఇచ్చింది. అప్పటికే ఎక్కువ కాలేజీలు ఫీజులను వసూలు చేసుకున్నాయి. దీంతో ఇప్పుడు ఫీజులను కాలేజీల ఖాతాల్లో వేయాలా? విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేయాలా? అనేది ప్రభుత్వానికి అంతుపట్టడం లేదు. కాగా, ఇంకా విద్యార్థులు కట్టాల్సి ఉందని, అందువల్ల తమకే ఫీజులు చెల్లించాలని కాలేజీలు కోరుతున్నాయి. అయితే మొత్తం కాలేజీల ఖాతాల్లో వేస్తే.. ఇప్పటికే ఫీజులు చెల్లించిన వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తింది. ఈ క్రమంలో అసలు ఎంత మంది విద్యార్థు లు ఫీజులు కట్టారనే వివరాలను ప్రభుత్వం విద్యార్థుల నుంచే సేకరిస్తోంది. సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభించింది. సచివాలయాల వారీగా 2023-24లో ఉన్నత విద్య చదివిన విద్యార్థుల వివరాలను పంపింది.


సచివాలయాల ఉద్యోగులు విద్యార్థులను సంప్రదించి ఫీజులు చెల్లించారా? చెల్లిస్తే ఎం త మేర కట్టారు? అనే వివరాలు సేకరిస్తున్నారు. ఫీజులు చెల్లించినప్పుడు కాలేజీలు ఇచ్చిన రశీదులను అప్‌లోడ్‌ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కాలేజీల నుంచి కూడా వివరాలు తీసుకోవాలని భావిస్తోంది. ఒక్కో కాలేజీకి ఎంత ఫీజు కట్టాలి? అందు లో విద్యార్థులు ఎంత చెల్లించారు? అనేది ధ్రువీకరణ చేసుకోనుంది. ఒకవేళ విద్యార్థులు, కాలేజీల వివరాల మధ్య వ్యత్యాసం కనిపిస్తే ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించాలి. అలాగే కొంత ఫీజు కట్టి, కొంత పెండింగ్‌లో పెడితే ఏం చేయాలనేది కూడా ప్రభుత్వానికి అంతుపట్టడం లేదు.

విధానం మార్చడంతోనే చిక్కులు

వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నగదు జమ విధానం మార్చడమే విద్యార్థులు, తల్లిదండ్రులకు శాపంగా మారింది. ఈ పథకంలో మొదటి నుంచీ ప్రభుత్వం ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకే వేసేది. మిగిలిన ఫీజును విద్యార్థులు కట్టుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. మొత్తం ఫీజు ను రీయింబర్స్‌ చేస్తామని చెప్పినా, దాన్ని కాలేజీల కు జమ చేయకుండా తల్లిదండ్రుల ఖాతాల్లో వేసే లా మార్చారు. కానీ వైసీపీ హయాంలో ఒక్కసారి కూడా ఫీజులను సకాలంలో విడుదల చేయలేదు. దీంతో క్వార్టర్‌ ముగిసిన వెంటనే కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేసి ఫీజులు కట్టించుకున్నాయి.

మేం ఏం చేయాలి?

ప్రభుత్వం ఫీజులు విడుదల చేసినప్పుడు తీసుకుందామని వేచిచూసిన అతి కొద్ది కాలేజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2023-24 విద్యార్థులు ఇప్పటికే బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ఫీజులను తల్లిదండ్రులకు వేస్తే.. అవి వసూలు చేసుకోవడం తమవల్ల కాదని ఆ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి చేయని తమకు న్యాయం చేయాలని కోరుతున్నాయి.

Updated Date - Jun 15 , 2025 | 06:57 AM