Share News

Vijayanagaram: పేలుళ్ల కుట్ర.. అదుపులో మరో ఇద్దరు

ABN , Publish Date - May 30 , 2025 | 04:53 AM

విజయనగరంలో సిరాజ్‌ రెహ్మాన్‌, సయ్యద్‌ సమీర్‌ల వాక్యూలు ఆధారంగా దర్యాప్తు అధికారులు వేగంగా మార్గదర్శనం చేస్తూ, వరంగల్‌కు చెందిన పర్హాన్‌ మొహిద్దీన్‌ మరియు ఖాజీపేట యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం టుటౌన్‌ పోలీసులు సిరాజ్‌ కుటుంబ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించి, సంబంధిత బ్యాంకు అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Vijayanagaram: పేలుళ్ల కుట్ర.. అదుపులో మరో ఇద్దరు

విజయనగరం/క్రైం, మే 29(ఆంధ్రజ్యోతి): సిరాజ్‌ రెహ్మాన్‌, సయ్యద్‌ సమీర్‌లు కస్టడీలో వెల్లడించిన ఆంశాలపై దర్యాప్తు అధికారులు స్పీడ్‌ పెంచారు. ఇందులో భాగంగా వరంగల్‌కు చెందిన పర్హాన్‌ మొహిద్దీన్‌, ఖాజీపేటకు చెందిన మరో యువకుడిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విజయనగరంలో సిరాజ్‌, సమీర్‌లను విచారిస్తున్న సమయంలోనే అధికారులు పలు రాష్ట్రాల్లో అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు విజయనగరం టూటౌన్‌ పోలీసులు గురువారం సిరాజ్‌తో పాటు అతని కుటుంబసభ్యుల ఆర్థిక లావాదేవీలపై ఆరాతీశారు. బ్యాంకు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

Updated Date - May 30 , 2025 | 04:55 AM