Share News

Kandual Vs Perninani: మీకు వ్యక్తులు చనిపోవడమే కావాలా.. పేర్నిపై ఏపీ మంత్రి ఫైర్

ABN , Publish Date - May 26 , 2025 | 02:01 PM

Kandual Vs Perninani: మాజీ మంత్రి పేర్నినాని కామెంట్స్‌పై మంత్రి కందుల దుర్గేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తి చనిపోవడం వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారా అంటూ నిలదీశారు.

Kandual Vs Perninani: మీకు వ్యక్తులు చనిపోవడమే కావాలా.. పేర్నిపై ఏపీ మంత్రి ఫైర్
Kandual Vs Perninani

రాజమండ్రి, మే 26: వైసీపీకి (YSRCP) చెందిన వ్యక్తి చనిపోతే కూటమి ప్రభుత్వం పతనం అవుతుందన్న మాజీ మంత్రి పేర్నినాని (Former Minister Perni Nani) వ్యాఖ్యలపై మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) కౌంటర్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. తమ పార్టీలోని వ్యక్తులు చనిపోయినా పర్వాలేదు అనుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మనుష్యులు చనిపోవాలని మాజీ మంత్రి మూర్కంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తి చనిపోవాలని కోరుకుంటున్నారా.. వ్యక్తి చనిపోవడం వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారా అంటూ నిలదీశారు. ఏది పడితే మాట్లాడితే చెల్లదన్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే చట్టపరంగా శిక్షించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. వ్యక్తులు చనిపోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.


థియేటర్స్ బంద్‌పై

అంతేకాకుండా థియేటర్స్ బంద్‌ను తప్పుగా చిత్రీకరించారంటూ సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు మాట్లాడటంపై కూడా ఏపీ మంత్రి స్పందించారు. సినిమా హాళ్ళు బంద్ అనే విషయంపై సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సినిమా రిలీజ్ సమయంలోనే కొందరు కావాలని వివాదాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. సినిమా హాళ్ళు బంద్ పాటించటం లేదన్నారు. చలనచిత్ర పరిశ్రమను ఏపీ ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని తెలిపారు. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్నారు. సినీపరిశ్రమకు సంబంధించిన కొంత మంది వ్యక్తులు మా సమస్యలు మేము పరిష్కరించుకుంటామని చెప్పటం అహంకార దోరణిగా పరిగణిస్తున్నామన్నారు. వైసీపీ మాజీ మంత్రికి మానవత్వం లేక పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాకముందే ఆ సినిమా కోసం మాట్లాడటం దుర్మార్గమని విమర్శించారు.


గోదావరి పుష్కరాల లోపే

మంత్రి ఇంకా మాట్లాడుతూ... అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు జూన్ మొదటి వారంలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరిలతో శంఖుస్థాపన చేయిస్తామని తెలిపారు. రూ.97 కోట్ల నిధుల్లో కొంతమేర టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో జాప్యం లేదని వెల్లడించారు. గండికోట ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. సూర్యలంక బీచ్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు కేంద్రం సహకరిస్తుందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టును గోదావరి పుష్కరాలు లోపే పూర్తి చేస్తామని చెప్పారు.


పీపీపీ పద్ధతిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తుందని అన్నారు. 21 పుణ్య క్షేత్రాల్లో వసతి, సౌకర్యాలు కల్పించేందుకు టెంట్ హౌస్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో హోం స్టేలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి, వైజాగ్‌లో స్టార్ హోటల్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఏపీలో 50 వేల రూంలు పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో రెండు హోటల్స్ నిర్మించేందుకు మెగా కంపెనీ వాళ్ళు ముందుకు వస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి

అతడికి ఏదో అయ్యింది.. పిచ్చివాడిగా మారాడు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2025 | 02:04 PM