Share News

Anagani: విజన్‌తో ముందడుగు

ABN , Publish Date - Jun 10 , 2025 | 02:27 AM

సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజన్‌-2047తో ముందడుగు వేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

Anagani: విజన్‌తో ముందడుగు
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యప్రసాద్‌, కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

ఇన్‌ఛార్జి మంత్రి అనగాని వెల్లడి

తిరుపతి(కలెక్టరేట్‌), జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజన్‌-2047తో ముందడుగు వేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధిలో ఎమ్మెల్యేలు, అధికారులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. అమరావతి నుంచి జిల్లాలు, నియోజకవర్గాల విజన్‌ కార్యాచరణ ప్రణాళిక యూనిట్లను వర్చువల్‌ విధానంలో సీఎం ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి మంత్రి అనగాని, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిజిల్లాలో జిల్లా,నియోజకవర్గ, మండల, సచివాలయ స్థాయి విజన్‌ డాక్యుమెంట్లు రూపొందించామని వివరించారు. ఈ ఐదేళ్లలో సాధించే అభివృద్ధితో పాటు 2047 నాటికి సాధించాల్సిన దానినీ వీటిలో పొందుపరిచినట్లు తెలిపారు. విజన్‌ ప్లాన్‌ భవిష్యత్తులో గొప్పఫలితాలను ఇస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఐదుగురు సభ్యుల బృందాన్ని నియమించామన్నారు.జేసీ శుభంబన్సల్‌, డీఆర్వో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 02:30 AM