Share News

Tirumala: శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న సోనూ సూద్‌..

ABN , Publish Date - Jun 02 , 2025 | 08:10 AM

Sonu Sood: ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోనూసూద్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారిగా 25 ఏళ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానని.. మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించానని ఆయన చెప్పారు.

Tirumala: శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న సోనూ సూద్‌..
Sonu Sood Tirumala visit

తిరుపతి: బాలీవుడ్‌ నటుడు (Bollywood actor), సామాజిక సేవకుడు (Social worker) సోనూ సూద్‌ (Sonu Sood) సోమవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల (Tirumala visit) శ్రీవారి సుప్రభాత సేవ (Suprabhata Seva)లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సోనూ సూద్‌ మీడియాతో మాట్లాడారు. తాను మొదటిసారిగా 25 ఏళ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానని.. మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. ‘నంది‘ పేరుతో కొత్త సినిమాను (New Film Nandi) ప్రారంభిస్తున్నామని, అందులో తాను నటించడంతోపాటు దర్శకత్వం కూడా చేస్తున్నానని సోనూ సూద్‌ వెల్లడించారు.


కాగా హైదరాబాద్‌లో జరిగిన మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్స్‌ వేడుకలో ప్రతిష్ఠాత్మక మానవతావాది అవార్డును సోనూ సూద్‌కు ప్రదానం చేశారు. కొవిడ్‌ 19 మహమ్మారి సమయంలో ఆపదలో ఉన్నవారికి సోనూసూద్‌ చేసిన సహాయానికి మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఈ అవార్డు ప్రదానం చేసి గౌరవించింది. ఫైనల్స్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన టాలీవుడ్‌ నటుడు రానా చేతుల మీదుగా సోనూ సూద్‌ ఈ పురస్కారం అందుకున్నారు. వలస కార్మికులు, విద్యార్థులు, పేద కుటుంబాలకు సహాయం చేస్తూ.. ప్రపంచ సంక్షోభ సమయంలో సోనూ ఆశాకిరణంగా నిలిచారు. ఆ తర్వాత కూడా ఆయన ఛారిటీ ఫౌండేషన్‌ ద్వారా విద్య, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, నిరుపేదల సాధికారతపై పనిచేస్తున్నారు.

Also Read: ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు


అలాగే బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ.. అవసరమైన పేద మహిళలకు సోనూ సూద్‌ ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌కు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఐదేళ్లపాటు విదేశీ సహకార నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్స్‌ మంజూరు చేసింది. దీంతో ఈ ఫౌండేషన్‌తో మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ‘బ్యూటీ విత్‌ ఏ ప్రాజెక్ట్‌’ కోసం చేతులు కలిపింది. క్యాన్సర్‌పై ప్రపంచవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని ఇరు సంస్థలు కలిపి చేపట్టనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉపాధ్యాయుడు మందలించడం.. ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు

పారిశ్రామిక హబ్‌గా ఏపీ

For More AP News and Telugu News

Updated Date - Jun 02 , 2025 | 10:18 AM