Share News

Bhanuprakash Eturi: డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌గా నెల్లూరు వాసి

ABN , Publish Date - May 30 , 2025 | 04:22 AM

నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన భానుప్రకాష్ ఎటూరి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన 2003లో ఐఏఎస్ బ్యాచ్‌లో చేరి, ఆంధ్రజ్యోతి విలేకరిగా పని చేసిన అనుభవం కలిగినవారు.

Bhanuprakash Eturi: డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌గా నెల్లూరు వాసి

  • ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి నుంచి 2003లోనే ఐఏఎస్‌కు..

నెల్లూరు, మే 29(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన భానుప్రకాష్‌ ఎటూరి డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా (డీఈసీ)గా నియమితులయ్యారు. ఈయన స్వస్థలం నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుకూరు గ్రామం. 2003 ఐఏఎస్‌ బ్యాచ్‌. అంతకముందు ఆయన ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు అల్లూరు విలేకరిగా పని చేశారు. జర్నలిజంలో కొనసాగుతూనే ఐఏఎస్‌ చేసి రాజస్థాన్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. 2018-2021 వరకు డిప్యుటేషన్‌పై ఏపీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఐదేళ్ల పాటు కొనసాగుతారు.

Updated Date - May 30 , 2025 | 04:24 AM