2 ప్రశ్నలకు ఆప్షన్లు మార్చాం: వీసీ
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:24 AM
కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2025 ఫలితాలను సెట్ చైర్మన్, ఉప కులపతి సీఎ్సఆర్కే ప్రసాద్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీ...

ఇంటర్నెట్ డెస్క్: కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2025 ఫలితాలను సెట్ చైర్మన్, ఉప కులపతి సీఎ్సఆర్కే ప్రసాద్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీ, హైదరాబాద్లలో 145 కేంద్రాల్లో మే 19 నుంచి 27వ తేదీ వరకు ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించామన్నారు. ర్యాంకు కార్డులను ఈఏపీసెట్ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. ఫలితాలను ఏపీఈఏపీసెట్ వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవచ్చన్నారు. జువాలజీ, ఫిజిక్స్లలో టైపోగ్రాఫికల్ లోపం వల్ల రెండు ప్రశ్నలకు ఆప్షన్స్ను మార్పు చేసినట్టు తెలిపారు. రెండు మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని, తదుపరి చర్యలపై కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు.