-
-
Home » Andhra Pradesh » ap annual budget sessions 2025 26 assembly today finance minister keshav speech nda govt present highlights super six schemes farmers benefits amaravati development income tax siva
-

AP Budget 2025-26 Live Updates: బడ్జెట్లో గుడ్ న్యూస్.. మే నుంచి అకౌంట్లో డబ్బులు
ABN , First Publish Date - Feb 28 , 2025 | 09:22 AM
AP Budget 2025-26 Live Updates in Telugu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ.3,22,359 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రశేపెట్టిన ప్రభుత్వం.. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కేటాయింపులు చేసింది.. మరి ఏ శాఖకు ఎంత కేటాయించిందో చూద్దాం..

Live News & Update
-
2025-02-28T17:22:04+05:30
బడ్జెట్లో గుడ్ న్యూస్.. మే నుంచి అకౌంట్లో డబ్బులు
బడ్జెట్లో కీలక పథకాలను వివరించిన మంత్రి నారాయణ
తల్లికి వందనం నిధులను మే నెలలో విడుదల చేస్తామన్న మంత్రి
-
2025-02-28T13:42:34+05:30
అమరావతి: బడ్జెట్పై బొత్స సత్యనారాయణ రియాక్షన్..
బడ్జెట్ అంతా ఆత్మస్తుతి , పరనింద లా ఉంది
గత ప్రభుత్వాన్ని తిట్టడం.. ముఖ్యమంత్రిని, ఆయన కుమారుడిని పొగుడుకోవడమే కనిపించింది.
ఈ తరహా సాంప్రదాయం కొనసాగించడం దురదృష్టకరం.
ప్రజలకు ఇచ్చిన హామీలపై అరకొరగా కేటాయింపులు చేశారు.
ప్రభుత్వం ప్రజలను వంచించింది, మోసం చేసింది.
18-50ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామన్నారు. ఆ మాటే లేదు.
బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు.
నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది.
అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకానికి సరిపడా నిధులు కేటాయించలేదు.
81లక్షల మంది విద్యార్థులు ఉండగా..12వేల కోట్లు కావాల్సి ఉంటే.. రూ. 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు.
52 లక్షల మంది రైతులకు రైతుభరోసా రూ. 20 వేలు ఇచ్చేందుకు రూ. 12వేల కోట్లు కావాల్సి ఉండగా అరకొరగా కేటాయించారు.
ఉగాది నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు.
గత ప్రభుత్వంలో 3వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడితే.. ఈ బడ్జెట్లో రూ. 300 కోట్లే పెట్టారు.
గుంటూరు మార్కెట్లో ఒక్క కిలో, బస్తా, క్వింటల్ మిర్చినైనా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు.
జబ్బలు చరచుకోవడం కాదు.. ఆచరణలో చూపిస్తామన్నారు.. చూపించాలి.
ప్రజలకు న్యాయం జరిగే బడ్జెట్ కాదు.. సామాన్య ప్రజలకు, నిరుద్యోగులకు న్యాయం జరగదు.
బడ్జెట్తో ఏ వర్గానికీ న్యాయం జరగదు.
-
2025-02-28T13:42:06+05:30
బడ్జెట్పై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందన ఇదే..
అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ అద్బుతంగా ఉంది: మంత్రి అనగాని సత్యప్రసాద్.
ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎం చంద్రబాబు ప్రజల అకాంక్షలను బడ్జెట్లో పొందుపరిచారు.
అభివృద్ధి, సంక్షేమంతోపాటు హామీల అమలుకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
రైతే ముందు అనే నినాదాన్ని బడ్జెట్లో కేటాయింపుల ద్వారా ఆచరణలో చూపించారు.
అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం.
రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చేలా జలవనరుల శాఖకు అధిక కేటాయింపులు చేశారు.
బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి బాటలు వేశారు.
-
2025-02-28T13:19:25+05:30
ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉంది: మంత్రి సత్యకుమార్
ఆరోగ్యశాఖకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు
మొత్తం బడ్జెట్లో దాదాపు 6 శాతం ఆరోగ్యం, వైద్య, విద్యకు కేటాయించారు
అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కేటాయింపులు చేశారు: సత్యకుమార్
-
2025-02-28T13:06:49+05:30
అమరావతి: వార్షిక బడ్జెట్పై టీడీఎల్పీ అభినందనలు.
టిడిఎల్పి సమావేశంలో చర్చించిన అంశాలు.
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, బిల్లులపై చర్చ.
రాష్ట్రానికి కేంద్ర నిధులు తెచ్చే అంశంలో మంత్రులు, ఎంపీల సమన్వయంపై చర్చ.
పోలవరం-బనక చర్ల లింక్ పనులు అనుసంధానం.
విజన్ 2047లో భాగంగా ఇండస్ట్రియల్ పాలసీపై - చర్చ.
విద్య రంగాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అన్నదానిపై చర్చ.
వాట్సప్ అప్ ద్వారా అందుతున్న 161 సేవలపై సమావేశంలో చర్చ.
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించిన అంశాలపై చర్చ.
-
2025-02-28T12:43:20+05:30
అమరావతి: ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో టిడిఎల్పి, పార్లమెంటరీ పార్టీ సమావేశం.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం.
సమావేశంలో పలు అంశాలపై చర్చ.
8 నెల్లలో సాధించిన విజయాల పై చర్చ.
తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ కార్యవర్గం నియామకంపై సమావేశంలో చర్చ.
మిర్చి ధర పెంపుదల, రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై చర్చ.
-
2025-02-28T11:40:32+05:30
డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు
875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు
విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమలుకు రూ.9,400 కోట్లు
ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు
-
2025-02-28T11:29:56+05:30
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్న
రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారం: అచ్చెన్న
వికసిత్ భారత్కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి: అచ్చెన్న
సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యం: అచ్చెన్న
గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.120 కోట్ల విత్తన రాయితీ చెల్లించాం
35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశాం: అచ్చెన్న
35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశాం: అచ్చెన్న
వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ల వినియోగం: అచ్చెన్న
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు: అచ్చెన్న
భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నాం: అచ్చెన్న
అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు
గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలు: అచ్చెన్నాయుడు
ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు
ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహానికి రూ.61 కోట్లు
వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు
7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశాం
-
2025-02-28T11:15:14+05:30
బడ్జెట్పై ప్రతి సభ్యుడికి పూర్తి అవగాహన రావాలి: స్పీకర్ అయ్యన్న
పూర్తి అవగాహనతో బడ్జెట్పై చర్చ జరగాలి: స్పీకర్ అయ్యన్న
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: స్పీకర్
బడ్జెట్ ప్రతులను ప్రతి సభ్యుడు క్షుణ్ణంగా చదవాలి: స్పీకర్
సభ్యులందరికీ వాట్సాప్ గ్రూప్లో బడ్జెట్ ప్రతులు: స్పీకర్
అందరికీ అర్థమయ్యే విధంగా బడ్జెట్పై చర్చ జరగాలి: స్పీకర్
-
2025-02-28T11:14:59+05:30
పోలవరం కోసం రూ.6,705 కోట్లు
జల్జీవన్ విషన్కు రూ.2,800 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు రూ.1,228 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసం రూ.4,332 కోట్లు
వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
R&B కి రూ.8,785 కోట్లు
యువజన, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.500 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు
ITI, IITల కోసం రూ.210 కోట్లు
దీన్దయాళ్ అంత్యోదయ యోజనకు రూ.745 కోట్లు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు రూ.10కోట్లు
ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు
ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు
మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
-
2025-02-28T10:46:33+05:30
పోర్టులు, ఎయిర్పోర్టుల కోసం రూ.605 కోట్లు
చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్కు రూ.450 కోట్లు
RTGSకు రూ.101 కోట్లు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు
అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు
-
2025-02-28T10:44:34+05:30
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రాయితీలు రూ.300 కోట్లు
ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు
మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు
తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు
అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు
దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు
బాల సంజీవని పథకం కోసం రూ.1,163 కోట్లు
-
2025-02-28T10:43:53+05:30
PMAY కింద 7 లక్షల ఇళ్ల నిర్మాణం
టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణం
ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు..
ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.75 వేలు
-
2025-02-28T10:43:41+05:30
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: పయ్యావుల
పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు
దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు
204 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం: పయ్యావుల
అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు
తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు
రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల ఇచిత విద్యుత్
చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
-
2025-02-28T10:43:40+05:30
ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్పులకు రూ.3,377 కోట్లు
పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు
స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు
ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్కు రూ.400 కోట్లు
-
2025-02-28T10:42:28+05:30
కేటాయింపులివే..
పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు
వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు
జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు
మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు
విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు
వ్యవసాయానికి రూ.11,636 కోట్లు
సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు
ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు
రవాణా శాఖకు రూ.8,785 కోట్లు
-
2025-02-28T10:42:27+05:30
ఎన్టీఆర్ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు.
రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నాం.
రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది.
అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకున్నాయి.
సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించాం.
-
2025-02-28T10:41:15+05:30
సంక్షిప్తంగా బడ్జెట్ స్వరూపం ఇదీ..
2025-26 వార్షిక బడ్జెట్ రూ.3 లక్షల 22 వేల 359 కోట్లు
తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్
రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
వయబులిటీ గ్యాఫ్ ఫండ్ రూ.2 వేలకోట్లు
మూలధనం అంచనా వ్యయం రూ.40,635 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు
రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు
ద్రవ్య లోటు రూ.79,926 కోట్లు
-
2025-02-28T10:26:52+05:30
అమరావతి: 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల.
నిర్ణయించిన ముహుర్తం ప్రకారం 10.08 గంటలకు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన ఆర్థిక మంత్రి.
ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్.
2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.
తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్.
సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్.
రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.
రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.
ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.
మూల ధన వ్యయం రూ.40,635 కోట్లు.
డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నాం.
నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటను ఎంచుకున్నారు.
తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని మరువలేం.
రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి.
రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజనులా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం.
రాజధాని అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని నిరూపితమైంది.
రాజధాని నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్టు నుంచి రూపాయి కూడా కేటాయించడం లేదు.
ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి నిధులు సమకూరాయి.
-
2025-02-28T10:21:52+05:30
అమరావతి: కొనసాగుతున్న ఏపీ బడ్జెట్ ప్రసంగం
పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు.
బిసి వెల్ఫేర్కు రూ. 23,260 కోట్లు.
వైద్యారోగ్య శాఖకు రూ. 19,260 కోట్లు.
పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలెప్మెట్రూ. 18,848కోట్లు.
జలవనరుల అభివృద్ది శాఖ రూ. 18,020 కోట్లు.
మున్సిపల్ అండ్ అడర్బన్ డెవలెప్మెంట్ రూ. 13,862 కోట్లు.
విద్యుత్ శాఖకు రూ. 13,600 కోట్లు.
వ్యవసాయానికి రూ. 11,636 కోట్లు.
సాంఘిక సంక్షేమం రూ. 10,909 కోట్లు.
ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రూ. 10,619 కోట్లు.
రవాణా శాఖకు రూ. 8,785 కోట్లు.
-
2025-02-28T10:16:19+05:30
ఏపీ బడ్జెట్.. రూ. 3.22 లక్షల కోట్లు..
అమరావతి: వయాబులిటీ గ్యాప్ ఫండ్ 2 వేల కోట్లు.
వివిధ ప్రాజెక్టులలో నిధులు కొరత ను అధిగమించేందుకు ఈ ఫండ్.
3 లక్షల 22 వేల కోట్లు తో బడ్జెట్.
48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్.
హౌసింగ్ లో నడుస్తున్న గృహ నిర్మాణానికి ఎస్సీలకు 50 వేల రూపాయలు ST లకు 70 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం.
-
2025-02-28T10:14:29+05:30
అమరావతి: బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కీలక కామెంట్లు చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల.
గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక మంత్రి.
వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చిన పయ్యావుల.
తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు.
చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.
అప్పులు చేయడమే తప్ప.. అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నాం.
వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు.
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదు.
-
2025-02-28T10:09:57+05:30
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి పయ్యావుల
వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం జరిగింది: పయ్యావుల
NDA కూటమిపై విశ్వాసంతో ప్రజలు అధికారం ఇచ్చారు
విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం: పయ్యావుల
గత వైసీపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి అడ్డుకట్ట వేసింది: పయ్యావుల
-
2025-02-28T10:06:54+05:30
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల
-
2025-02-28T10:06:03+05:30
చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
2025-26 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల
-
2025-02-28T09:26:40+05:30
మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల..
అమరావతి: ఈరోజు 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.
అందులో భాగంగా ముందుగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్కు విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలసి బడ్జెట్ ప్రతులకు శాస్త్రోకంగా పూజలు నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఏఎస్, ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే. నివాస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, IA&AS, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్, ఐఏఎస్ లు హాజరు.
బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరిన మంత్రి పయ్యావుల.
సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను అందచేయనున్న పయ్యావుల.
కెబినెట్ భేటీలో బడ్జెట్టుకు ఆమోదం తెలపనున్న ప్రభుత్వం.
-
2025-02-28T09:22:22+05:30
మరికాసేపట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్..
అమరావతి: బడ్జెట్ ప్రతులతో అమరావతిలోని వెంకటాయపాలెం వద్ద టిటిడి ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల కేశవ్.
2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచిన మంత్రి.
ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని వేడుకున్న మంత్రి పయ్యావుల.