Arrest: వైసీపీ నేత జగన్మోహన్ అరెస్టు..
ABN , Publish Date - Jun 15 , 2025 | 01:41 PM
YCP Leader Arrest: కదిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలోని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఏకంగా శిలాఫలకాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. ఈ ఘటనలో వైసీపీ నేత జగన్మోహన్ను పోలీసులు అరెస్టు చేసి కదిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే...

Satya Sai Dist: కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ (Kadiri Rural Police Station)లో వైసీపీ నేతలు (YCP Leaders) హల్ చల్ (Protest) చేశారు. గాండ్లపెంట శిలాఫలకాల ధ్వంసం కేసు (Gandlapenta vandalism case)లో వైసీపీ నేత జగన్మోహన్ (Jaganmohan)ను పోలీసులు అరెస్టు (Arrest) చేసి కదిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే వారిని విచారిస్తుండగా మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా (Ex MLA Chand Basha) మరికొందరు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కదిరి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని హల్ చల్ చేయాలని చూశారు. నిందితులను సమర్ధిస్తారా అని పోలీసులు ప్రశ్నించడంతో వైసీపీ నేతలు తోక ముడిచి అక్కడి నుంచి వెళ్ళిపోమారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక..
కదిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఏకంగా శిలాఫలకాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. గాండ్లపెంట మండలంలో ఐదు రోజుల క్రితం రూ. 50 లక్షలతో నిర్మించే రోడ్డు పనులను ప్రారంభించారు. అయితే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేని అదే మండలానికి చెందిన మాజీ ఎంపీసీ జగన్మోహన్తోపాటు మరికొందరు వైసీపీ నేతలు అక్కడ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. దీనిపై కొందరు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం..
పోలీసుల విచారణలో వైసీపీ నేతలే శిలాఫలకాల విధ్వంసానికి పాల్పడ్డారంటూ నిర్ధారణ అయింది. దీంతో మాజీ ఎంపీసీ జగన్మోహన్తోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక వైసీపీ నేతలతోపాటు మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా కదిరి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫేక్ కేసు నమోదు చేశారంటూ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు శిలాఫలాకాలు ధ్వంసం చేసినవారిని, నిందితులను సమర్థిస్తారా అంటూ పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తూ, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి:
రౌండ్ టేబుల్ సమావేశంపై యనమల మండిపాటు
ఎయిరిండియా విమాన ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య
For More AP News and Telugu News