Home » Kadiri
రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారం చేపట్టినప్పటినుంచి సుపరిపానలతో ప్రజలు సురక్షితంగా ఉన్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సుపరిపాలనకు తొలిఅడుగు - ఇంటింటికి టీడీపీ కార్య క్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం రూరల్ పరిధిలోని కుమ్మరవాండ్ల పల్లిలో ప్రారంభించారు. అలాగే ఆయన నంబులపూలకుంట మండలంలో ని కమ్మగుట్టపల్లి, గౌకనపేటలో సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమం లో పాల్గొన్నారు.
మండలపరిధిలోని సోమ యాజులపల్లిలో విలేజీ హెల్త్ క్లినిక్ను ఎప్పుడు ప్రారంభిస్తారో అని ఆ గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. గ్రామీణులకు వై ద్యం అందించే లక్ష్యంతో గత ప్రభుత్వంలో దీనిని నిర్మించారు. దీని నిర్మాణానికి అప్పట్లో రూ. 23లక్షల నిధులు కేటాయించారు. దీంతో నిర్మాణం పూర్తి అయి యేడాది అవుతోంది. అయితే కాంట్రాక్టర్కు ఇంకా 20శాతం బిల్లులు రావాల్సిఉందని పంచాయతీ రాజ్శాఖ అధికారులు అంటున్నారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని తహసీల్దార్ సురేశకుమార్ తదితరులు సూ చించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం ధర్మవరం వనటౌన, టూటౌన పోలీస్ స్టేషనల ఆధ్వర్యంలో అధికారులు, విద్యార్థులు తదితరులు అవగా హన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సురేశకుమార్, ఎంఈఓ గోపాల్నాయక్, టూటౌన సీఐ రెడ్డప్ప, రూరల్ సీఐ ప్రభాకర్, ముదిగుబ్బ రూరల్ సీఐ శ్యామరావు, ఎక్సైజ్ శాఖ సీఐ చంద్రమణి హాజరయ్యారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి మా నసిక రోగి అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఎమ్మె ల్యే గురువారం పట్టణంలోని 20వార్డులో మనింటికి మన ఎమ్మెల్యే కార్య క్రమాన్ని నిర్వహించారు. ఆయన ఇంటింటికెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షు డు జగన్మోహనరెడ్డి మానసిక రోగంతో బాధపడుతున్నారని, అందుకే టీడీపీ మ్యానిఫెస్టో పట్టుకుని ఇంటింటికెళ్లి అడగాలని వైసీపీ నాయకుల కు చెబుతున్నారన్నారు.
మండలంలోని జౌకల కొత్తపల్లి లో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు ఈ పాఠశాలలో దాదాపు 80మందికి పైగా చదువుతున్నారు. ఈ పాఠశాలకు గత వైసీపీ ప్రభుత్వంలో నాడు - నేడు పథకం కింద మూడుఅదనపు తరగతి గదులు, వంటగదితో పాటు మరుగుదొడ్లను మం జూరు చేశారు. పనులు మొదలు పెట్టి గోడల వరకు నిర్మించారు. అక్కడి తో పనులు అగిపోయాయి.
తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ సచివాలయ సర్వేయర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మండలంలోని గ్రామ సచివాలయ సర్వేయర్లు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతిపత్రం సమర్పిం చారు. జీఓ నెం.1 ప్రకారం హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు సిబ్బందిని గ్రామ సర్వేయర్లుగా నివేదిక సమర్పించాలన్నారు.
ప్రతినెలా 18వ తేదీ లోగా విద్యుత బిల్లులు చెల్లించాలని విద్యుత శాఖ అధికారులు చెబుతున్నారని అయితే ముదిగుబ్బలో విద్యుత బిల్లులు కట్టించుకునేవారు లేకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నామని గృహ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. పలు వురు వినియోగదారులు బుధవారం కూడా విద్యుత సబ్స్టేషన వద్ద వేచి చూసి వెనుదిరిగి పోయారు.
ప్రైవేటు బడుల కంటే ప్రభుత్వ బడులు మిన్నగా ఉండా లని గత వైసీపీ ప్ర భుత్వం నాడు-నేడు ప నులు చేపట్టింది. రూ. కోట్లు వేచ్చించి పాఠ శాల భవనాలు నిర్మించి నా, నీటి వసతి లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా రు. మరుగు దొడ్లు నిరుపయోగంగా మారాయి. మండలంలో ఏడు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు, ఆరు ప్రాథమికోన్నత, 40 ప్రాథమిక పాఠశాలలు ఉన్నా యి.
అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. ఆయన శనివారం మండలంలోని మల్లమీదపల్లిలో మూడోరోజు శనివారం మనింటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. పంచాయ తీలోని కోటూరు, బనానచెరువుపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికెళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు లబ్ధిదారుల తో మాట్లాడి గృహాలు, పింఛన్లు, విద్యుత, రేషనకార్డులు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
శారీరక, మానసిక వికాసానికి యోగా తోడ్పడుతుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని గూటి బైలు గ్రామంలో వెలసిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో శనివారం అంత ర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కంది కుంట హాజరయ్యారు.