MLA: కార్యకర్తల కష్టం కళ్లారా చూశాం
ABN , Publish Date - May 22 , 2025 | 12:12 AM
‘గత ఐదేళ్ల వైసీపీ హయాంలో టీ డీపీ కార్యక ర్తల కష్టాన్ని కళ్లారా చూశాం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన కార్యక ర్తలకు తప్పక న్యాయం చేస్తాం. కార్యకర్త ల రుణం తీర్చు కోలేనిది.’ అని శింగనమల నియోజకవర్గం మినీ మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలకేంద్రమైన గార్లదిన్నెలోని మర్తాడు క్రాస్ వద్ద టీ కన్వెన్షన హాల్లో మినీ మహానాడు ను బుధవారం నిర్వహించారు.

- ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం
- వారి రుణం తీర్చుకోలేనిది
- మినీ మహానాడులో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ
గార్లదిన్నె, మే 21(ఆంధ్రజ్యోతి): ‘గత ఐదేళ్ల వైసీపీ హయాంలో టీ డీపీ కార్యక ర్తల కష్టాన్ని కళ్లారా చూశాం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన కార్యక ర్తలకు తప్పక న్యాయం చేస్తాం. కార్యకర్త ల రుణం తీర్చు కోలేనిది.’ అని శింగనమల నియోజకవర్గం మినీ మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలకేంద్రమైన గార్లదిన్నెలోని మర్తాడు క్రాస్ వద్ద టీ కన్వెన్షన హాల్లో మినీ మహానాడు ను బుధవారం నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారా యణ, ఏడీసీసీ బ్యాంకు చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, ని యోజకవర్గం పరిశీల కురాలు పర్వీనతాజ్, రాష్ట్ర నిర్వహక కార్యదర్శి రామలింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ జెండాను అవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేశ రక్షణలో భాగంగా ప్రాణాలర్పించిన వీర జవాన్ల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ ఐదేళ్లలో కుల, మతాలకు తావు లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సం క్షేమ పథకాలు అందించి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించి, నియోజకవర్గాన్ని అభివృ ద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. కార్య కర్తలు కాలర్ ఎగరేసేలా చేస్తామన్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో సైకో జగన్మోహన రెడ్డి రాష్ర్టాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేశార న్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టించి, అభివృద్ధి పథంలో నడుపుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజల సంక్షేమం కోసం పథకాలు అమలు చే స్తున్న ఘనత చంద్రబాబుదే అన్నారు. అలాగే మంత్రి నారా లోకేశ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం గ ర్వకారణ మన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచే సినా... ఎవరూ భయపడకుండా పార్టీకి అండా నిలిచారన్నా రు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నియోజ కవర్గంలో దశాబ్దాలుగా ఉన్న సాగు, తాగు నీటి సమస్య పరిష్కారానికి పరిష్కరిస్తామన్నారు. అలాదే ప్రతి నెల ఒక మండలంలో అధికారులతో కలసి కార్యకర్తల గ్రీవెన్స నిర్వహించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....