Home » Singanamala
మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎవరికి ఉపాధిని కల్పిస్తోందో తెలి యడం లేదు. కూలీలకు ఉపాధి దేవుడికి తెలియాకానీ, అక్రమార్కుల పా లిట కల్పతరువుగా మారింది. తాము చెప్పినట్లు వినకపోతే నాయకుల కు, అధికారులకు చెప్పి మిమ్మల్ని తొలగిస్తామని పలు గ్రామాలలో క్షేత్ర స్థాయి లో ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఈ ఒత్తిళ్లతో కొంత మంది పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు మస్టర్లలో పేర్లు ఎక్కించాల్సిన పరి స్థితి నెలకొందని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చర్చించుకుంటున్నారు.
నియోజకవర్గం అభివృద్ధికి నిధులను కేటాయించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలసి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ జిల్లా ఇనచార్జ్ మంత్రి టీజీ భరతను కోరారు. శుక్రవారం అనంతపురానికి వచ్చిన మంత్రి భరతను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్థానిక ఆర్అండ్బి అతిథి గృహంలో మర్వాద పూర్వకంగా కలసి, నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
చీనీ రైతులకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్యాన శాఖాధికారి రత్నకుమార్ పే ర్కొన్నారు. గురువారం స్థానిక రైతు సేవా కేంద్రంలో ఉద్యాన రైతులకు, ఏపీఎంఐపీలోని ఎఫ్సిఓలకు డ్రోన సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముకుందాపురం గ్రా మంలో చీనీ తోటలను సందర్శించారు.
ఎస్సీ ఉపవర్గీకరణకు కేబి నెట్ అమోదం తెలుపడం సామాజిక న్యాయానికి చారిత్రాత్మక విజ యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఆమె గురువారం అనంతపురం లోని క్యాంపు కార్యాలయంలో ఎస్సీ ఉపవర్గీకరణకు కే బినేట్ అమోదంపై ఎస్సీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వ హించి, ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
శింగనమల నియోజకవర్గ రైతుల పట్ల సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ అని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అసలే వేసవికాలం. గత ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో మండలంలోని కుంటలు, చెరువుల్లో నీరు లేదు. మూగజీవాల దాహం తీర్చే నీటి తొట్టెలు కనబడడంలేదు. దీంతో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు గొర్రెల కాపర్లు, రైతుల తిప్పలు వర్ణనా తీతం. వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియోజక వర్గంలోని గురుకుల, మోడల్ పాఠశాలలు, కేజీబీ వీల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించారు. ఎమ్మెల్యే మంగళవారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన విద్యా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు.
మండల కేంద్రంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉట్లపరుష ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం ఉట్ల పరుష కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది.
మండలంలోని శివపురం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడి పోతున్నారు. కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించేదుకు ఎనిమిది నెలలు కిందట ఆర్డీటీ వారు బోరు వేసి, మోటారు ఏర్పాటు చేశారు. కానీ పంచాయతీ అధికారులు మోటారుకు విద్యుత కనెక్షన ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు.
వలస కూలీల నివారణ కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా నార్పల మండలం బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అయితే అధికారులు ఉపాధి పనులు కల్పించకపోవడంతో, పనుల కోసం కూలీలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ మండలంలోనే నెలకొంది. నార్పల మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి 12వేల జాబ్కార్డులు ఉన్నాయి.