Share News

CLINIC: పిల్లర్ల వద్దే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:07 AM

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ (ఆయుష్మాన ఆరోగ్య మందిర్‌) భవనాలను మంజూరుచేసింది. వీటి నిర్మా ణానికి మూడేళ్ల క్రితమే గత వైపీపీ పాలనలో నిధులు మంజూరుచేసినా నేటికీ పూర్తి కాలేదు. దీంతో పిల్లర్ల వరకే పరిమితమయ్యాయి. గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేం ద్రాల భవనాలను గత వైసీపీ ప్రభుత్వం ఆయా పంచాయతీల్లో మంజూ రు చేసింది.

CLINIC: పిల్లర్ల వద్దే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు
Building of Village Health Clinic in Regathipalli with pillars

- మూడేళ్లుగా నిలిచిపోయిన పనులు

- సరిగా బిల్లులు మంజూరు కాకపోవడంతోనే...

- సరైన వసతులు లేని గదుల్లో కొనసాగింపు

ధర్మవరంరూరల్‌, జూన 13 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ (ఆయుష్మాన ఆరోగ్య మందిర్‌) భవనాలను మంజూరుచేసింది. వీటి నిర్మా ణానికి మూడేళ్ల క్రితమే గత వైపీపీ పాలనలో నిధులు మంజూరుచేసినా నేటికీ పూర్తి కాలేదు. దీంతో పిల్లర్ల వరకే పరిమితమయ్యాయి. గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేం ద్రాల భవనాలను గత వైసీపీ ప్రభుత్వం ఆయా పంచాయతీల్లో మంజూ రు చేసింది. దీంతో పంచాయతీ రాజ్‌ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఉపాధిహామీ నిఽధులతో భవన నిర్మాణ పనులను చేపట్టారు. మూడేళ్ల క్రితం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అయితే వాటి పనులు ముందుకు సాగలేదు. ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో మూడేళ్లుగా ఆ భవనాలు పునాదులకే పరిమితమయ్యాయి. అప్పట్లో సకాలంలో బిల్లులు చెల్లించక పోవడంతో అయినకాడికి కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుని వాటి నిర్మాణాన్ని అర్ధాంతరంగా వదిలేసినట్లు సమాచారం. ధర్మవరం మండ లంలో ఎనిమిది విలేజ్‌ క్లినిక్‌లు మంజూరయ్యాయి. ఒక్కో విలేజ్‌ క్లినిక్‌కు రూ. 17.50లక్షలు నిధులతో భవన నిర్మాణాలు చేపట్టారు. వీటిలో నిమ్మ లకుంట, తుమ్మల, పోతుకుంట మూడు పంచాయతీల్లో మాత్రం భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. నిధుల విడుదలలో జాప్యం కావడంతో మిగి లిన వాటి నిర్మాణాలు పునాదుల వద్దే నిలిచి పోయినట్లు సంబంధిత కాం ట్రాక్టర్ల ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా నిర్మాణ వ్యయం ఖర్చులు, సా మగ్రి, కూలీల ధరలు పెరిగిపోవడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లిం చక పోవడంతో నిర్మాణాలు ఆర్ధాంతరంగా నిలిచిపోయినట్లు సమాచా రం. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఆ నిర్మాణాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.


పంచాయతీ భవనాల్లోనే కొనసాగింపు

మండలంలోని ధర్మపురి పంచాయతీకి విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ మంజూరైంది. అయితే పిల్లర్ల వరకే పరిమితమైంది. దీంతో ఆ గ్రామంలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను పాత పంచాయతీ భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే పంచాయతీ అఽధికారులు ఆ భవనాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నా అప్పటి నుంచి ప్రజలకు ఆరోగ్యసేవలు నిలిచిపోయే పరిస్థితి ఉందని గ్రామస్థులు అంటున్నారు. అదేవిధంగా గొట్లూరులో ఆరోగ్యఉపకేంద్రాన్ని గతంలో వైసీపీ నాయకులు కూల్చివేయడంతో ఆ గ్రామంలో కూడా పాత పంచాయితీ భవనంలోనే వైద్య సిబ్బంది ఆరోగ్యసేవలు అందిస్తున్నారు. రేగాటిపల్లిలో మూడేళ్లకు పైగా ఆరోగ్యకేంద్ర నిర్మాణానికి పిల్లర్లవేసి వదిలేశారు. దీంతో ఆ గ్రామంలోని ఓ ప్రైవేటు భవనంలో కేంద్రాన్ని నడుపుతున్నారు. విలేజ్‌ క్లినిక్‌ల భవన నిర్మా ణాలు ఎప్పుడు పూర్తి అవుతాయోనని ఆయా గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. గత వైసీపీ పాలనలో ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహించారని, ప్రస్తు ప్రభుత్వంలోనైనా నిధులు విడుదల చేసి ప్రజలకు మెరుగైన ఆరోగ్యసేవలు అందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

- శ్రీరాములు, పంచాయతీరాజ్‌ డీఈ, ధర్మవరం

గ్రామాల్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవనాల నిర్మాణాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధుల విడుదలకు నివేదికలు పంపించాం. నిధులు విడుదల కాగానే పీఆర్‌ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు, అన్ని భవనాల నిర్మాణాన్ని పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 14 , 2025 | 12:07 AM