Home » Dharmavaram
కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీ డీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గంగులప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గంగులప్పకు టీడీపీ సభ్యత్వం ఉండడంతో పరిటాల శ్రీరామ్ చొరవ తీసుకొని వివరాల్ని పార్టీ కార్యా లయానికి పంపారు.
మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల పొడవునా కంపచెట్లు ఏపుగా పెరిగి రోడ్ల పైకి వచ్చాయి. రోడ్లకు ఇరువైపులా ఇలా ఉండడంతో ఆయా గ్రామస్థు లు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలుపుల వద్ద దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు వాపోతు న్నారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిం చిన ఏడు వరాలపై మండలం లోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. వారు మంగళవారం ముందుగా బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండలంలోని పొడరాళ్లప ల్లి లో దాదాపు 50 ఏళ్లుగా భూమి కోసం జరుగుతున్న వివాదానికి టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ శాశ్వత పరిష్కారం చూ పారు. ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో కొందరు దళితులు 51 సెంట్లలో గుడిసెలు వేసుకున్నారు. దీనిపై సుమారు 50 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇరు పక్షాల వారు కోర్టుకు వెళ్లినా పరిష్కారం కాలేదు
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని రాష్ట్ర ఆహర కమిషన సభ్యురాలు గంజిమాల దేవి సూచించారు. ఆమె మంగళవారం ముదిగుబ్బ మండల కేంద్రం లోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ని తనిఖీ చేశారు. పాఠశాలలో నిత్యావసర వస్తువులను, ఆహార తయారీని, విద్యార్థులకు అందుతున్న మౌళిక వసతులను, వంటశాలను పరిశీలించారు.
మండలంలో నెలకొన్న చుక్కల భూముల సమస్యతో పాటు ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులు సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత శాఖ కార్యాల యం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
గ్రామాలలో ప్రకృతి వ్యవ సాయాన్ని విస్తరింపజేయలని డీపీఎం లక్ష్మనాయక్ ఐసిఆర్పీలకు సూ చించారు. కొత్తగా ఎంపికైన ట్రైనీ ఐసీఆర్పీలకు మండలపరిధిలోని గం టాపురం గ్రామంలో సోమవారం ప్రకృతి వ్యవసాయం లో శిక్షణ ఇ చ్చారు.
పట్టణంలోని కేశవనగర్లో వెల సిన అయ్యప్పస్వామి ఆలయ గురుస్వామి, అయ్యప్ప మాలధారుల ఆధ్వ ర్యంలో ఆదివారం స్వామి గ్రామోత్పవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూల విరాట్కు అభిషేకాలు చేశారు. అనంత రం అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి, పల్లకిలో ఉంచి పురవీధుల గుండా ఊరేగించారు.
పట్టణంలోని కేశవనగర్లో వెలసిన అయ్యప్పస్వామి ఆలయంలో గురుస్వామి విజయ్కుమార్, అ య్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో శనివారం స్వామికి లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వేద మంత్రాలు, మం గళవాయిద్యాల నడుమ సాగింది.
అనునిత్యం తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల ఉన్నతిని కోరుకునేది ఉపాధ్యాయులు మాత్రమే నని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణం లోని బీఎస్ఆర్ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ని ర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి పరిటాలశ్రీరామ్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు.