Share News

JSP: ముగ్గుల పోటీలు

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:27 AM

రాష్ట్ల్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలన మొదలై ఏడాదైన సందర్భంగా తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌ ఆదేశాల మేరకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. చిలకం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద సంక్రాంతిని తలపించే విధంగా ముగ్గుల పోటీ లు నిర్వహించారు.

JSP: ముగ్గుల పోటీలు
Chilakam Madhusudan Reddy presenting the first prize

దర్మవరం, జూన 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ల్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలన మొదలై ఏడాదైన సందర్భంగా తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌ ఆదేశాల మేరకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. చిలకం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద సంక్రాంతిని తలపించే విధంగా ముగ్గుల పోటీ లు నిర్వహించారు. దుత్తలూరి కమలబాలాజీ, దుత్తలూరి అనితా సారఽథి, రామలాలిత్య న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలైన సునీతకు ప్రథమ బహుమతి కింద రూ.5వేలు, ద్వితీయ బహుమతి కింద నవ్యరెడ్డి, హాన్సీకి రూ. 2వేలు చొప్పున, తృతీయ బహుమతి కింద తేజస్విని, పద్మజ, మమత, లక్ష్మీదేవికి రూ.1000 చొప్పున నగదు బహుమతులు, పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సొలేషన బహుమతులు అందజేశారు. అనంతరం చిలకం మా ట్లాడుతూ... గత ఐదేళ్లలో జగన పాలన వల్ల రాష్ట్రం పదేళ్లు వెన క్కి వెళ్లిందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ జరగ నట్టు వైసీపీ వెన్నుపోటు దినం జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అద్యక్షుడు అడ్డగిరి శ్యాంకుమార్‌, నాయకులు ఢిష్‌రాజు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 05 , 2025 | 12:27 AM