Home » Puttaparthi
Puttaparthi Theft Incident: ఒకేసారి 10 ఇండ్లలో చోరీ జరగడంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అవాక్కైన పరిస్థితి. అయితే దుండగులు చోరీ చేసిన ప్రదేశంలో కలెక్టర్ బంగ్లా కూడా ఉండడం విశేషం.
జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పదో తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు.
CM Chandrababu On Eucation: ఆడ బిడ్డల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చానని.. రిజర్వేషన్లలో మహిళకు పెద్ద పీట వేశానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం డబ్బులు ఇచ్చి చదువు చెప్పించే బాధ్యత తనది అని స్పష్టం చేశారు.
Minister Lokesh Mega PTM: స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక చదువుపై పేరెంట్స్ బాధ్యతగా ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని.. విద్యాశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటుతామని వెల్లడించారు.
CM Chandrababu With Students: విద్యార్థులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తిలకించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్లో వారిద్దరూ ఫొటోలు దిగారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన యేడాదిలోనే ఇచ్చిన పలు హామీలు నెరవేర్చిందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలిఅడు గు కార్యక్రమంలో భాగంగా వారు బుధ వారం మండలంలోని కసముద్రం గ్రామంలో పర్యటించారు.
మండలంలోని పలు రోడ్లు గుంతల మయమై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తి అయినా నల్లమాడ మండలంలో ఆ రోడ్లలో మార్పులేదు. మండలంలోని శీకివారిపల్లికి రెడ్డిపల్లి - మలక వేమల ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల తారు రోడ్డ్డును 15 యేళ్ల క్రితం అప్పటి టిడీపీ ప్రభుత్వంలో వేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదు. రోడ్డంతా గుంతలు పడి అ ధ్వానంగా మారింది.
గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలన్న సద్భావంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురు వారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలికి ఇరువైపులా ఉన్న ఆర్అండ్బీ స్థలాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించు కునేం దుకు రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయ తీ అధికారులు మార్కింగ్ ఇచ్చారు. ఆ మార్కింగ్ కూడా పుట్టపర్తి రహదారి లో ఒక్కొక్కరికి ఒకరకంగా మార్కింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉండగా బుక్కపట్నం రహదారి కి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మా ణా ల తొలగింపు కోసం కూడా మార్కింగ్ ఇచ్చారు.
రాష్ట్ల్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలన మొదలై ఏడాదైన సందర్భంగా తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ ఆదేశాల మేరకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. చిలకం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద సంక్రాంతిని తలపించే విధంగా ముగ్గుల పోటీ లు నిర్వహించారు.