MLA: అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం చూపాలి
ABN , Publish Date - May 05 , 2025 | 11:43 PM
అర్జీలు పునరావృతం కాకుండా న్యాయమైన పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అధికారులకు సూచించారు. శింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలో చెరువు కట్ట వద్ద ఉన్న శ్రీ షిర్డీసాయి కల్యాణమండపంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి.

- అధికారులకు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ సూచన
బుక్కరాయసమద్రం, మే 5(ఆంధ్రజ్యోతి): అర్జీలు పునరావృతం కాకుండా న్యాయమైన పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అధికారులకు సూచించారు. శింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలో చెరువు కట్ట వద్ద ఉన్న శ్రీ షిర్డీసాయి కల్యాణమండపంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 525 వినతులు అందాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జా యింట్ కలెక్టర్ శివ నారాయణశర్మ, ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ, డీఆర్వో మలోల, అనంత పురం ఆర్డీఓ కేశవనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి ఉ మా మహేశ్వర మ్మ తదితర ముఖ్య అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అ నంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... అర్జీదారుడు సంతృప్తి చెందేలా సంబం ధిత శాఖ అధికారులు ప్రతి సమస్య పరిష్కారం పట్ల చొరవ చూపాలన్నారు. భూ సమస్యలు, ఇంటి పట్టాలు, భూమి రస్తా విషయాలు, రీ సర్వే లో జరిగిన తప్పులపై ఎక్కువ అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వేసవి కాలం కావడంతో పలు చోట్ల తాగునీటి సమస్యపై అర్జీలు ఇచ్చారని తెలిపారు. బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి, కేకే ఆగ్రహారం, గోవిందంపల్లిల్లో ఎస్సీల శ్మశాన వాటిక స్థలం కోసం వినతుల అందజేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....