divotional ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:21 AM
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని శనివారం హెచ్చెల్సీ కాలనీలో గల కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

అనంతపురం కల్చరల్, జూన 7 (ఆంధ్రజ్యోతి): జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని శనివారం హెచ్చెల్సీ కాలనీలో గల కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు ఉదయమే స్వామివారి మూలవిరాట్కు 324 వడలతో నివేదన, బెల్లంపానకంతో అభిషేకం చేశారు. అనంతరం వడమాలలు సమర్పించి ఆకుపూజ, ప్రత్యేకపూజలు జరిపారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్కుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి దేవనూరు సుందరం విజయ్కుమార్, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..