COLORS: తొలగని వైసీపీ రంగులు
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:22 AM
మండలంలోని రావులచెరువు గ్రామ సచివాలయానికి వైసీపీ జెండా రంగులు ఇం కా దర్శనమిస్తున్నాయి. వాటిని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. సచివాలయానికి ముందుభాగంలోనే వైసీపీ జెండా రంగులు వేశారు. అప్పట్లో ప్రభు త్వ భవనాలకు పార్టీజెండా రంగులు వేయకూ డదని హైకోర్టు ఆదే శాలు ఇచ్చిన అవేవీ పట్టించుకోకుండా ఆ గ్రామ సచివాలయానికి వైసీీపీ రంగులు వేశారు.

ధర్మవరంరూరల్, జూన 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని రావులచెరువు గ్రామ సచివాలయానికి వైసీపీ జెండా రంగులు ఇం కా దర్శనమిస్తున్నాయి. వాటిని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. సచివాలయానికి ముందుభాగంలోనే వైసీపీ జెండా రంగులు వేశారు. అప్పట్లో ప్రభు త్వ భవనాలకు పార్టీజెండా రంగులు వేయకూ డదని హైకోర్టు ఆదే శాలు ఇచ్చిన అవేవీ పట్టించుకోకుండా ఆ గ్రామ సచివాలయానికి వైసీీపీ రంగులు వేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇంకా అధికారులు ఆ రంగులను తుడిపేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. అది సచివాలయమా లేక వైసీపీ కార్యాలయమా అన్నట్లుగా ఉందని ఆ గ్రామ సచివాలయానికి వెళ్లే ప్రజలు ఆసహ నం వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారుల పర్యవేక్షణ లేకపోవ డంతోనే గ్రామ సచివాలయ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని రాయలచెరువు గ్రామస్థులు పేర్కొంటున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....