Share News

Operation Sindoor: మురళీ నాయక్ పార్థీవదేహాన్ని భుజాలపై మోసిన లోకేష్..

ABN , Publish Date - May 11 , 2025 | 01:58 PM

Operation Sindoor: చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని మురళీ నాయక్ కలలు కన్నారని, తాను చనిపోతే జాతీయ జెండా కప్పుకునే చనిపోతానని మురళీ నాయక్ అన్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి వీరజవాన్ మురళీ నాయక్ అని, సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉండగలగుతున్నామని ఆయన అన్నారు.

Operation Sindoor: మురళీ నాయక్ పార్థీవదేహాన్ని భుజాలపై మోసిన లోకేష్..
Operation Sindoor

శ్రీ సత్యసాయి జిల్లా: దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్ మురళీ నాయక్ (Murali Naik) కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని, దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ (Pakistan)తో పోరాడుతూ.. మురళీ నాయక్ వీరమరణం పొందారని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లితండాలో అమర జవాను మురళీ నాయక్ అంత్యక్రియ (Funeral)ల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రులు లోకేష్, అనిత (Anitha), సవిత (Savitha), స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


మురళీ నాయక్ చివరి కోరిక..

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని మురళీ నాయక్ కలలు కన్నారని, తాను చనిపోతే జాతీయ జెండా కప్పుకునే చనిపోతానని మురళీ నాయక్ అన్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి వీరజవాన్ మురళీ నాయక్ అని, సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉండగలగుతున్నామని అన్నారు. చిన్నవయసులోనే అగ్నివీర్ మురళీనాయక్ చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం, 5 ఎకరాల పొలంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు 300 గజాల ఇంటి స్థలం, వీరజవాన్ మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా రూ. 50 లక్షలు మురళీ నాయక్ కుటుంబానికి ఇస్తామని ప్రకటించారు.

Also Read: శాంతి, ఐక్యత సందేశం ఇచ్చిన ఆరంభ వేడుకలు


పార్థీవదేహాన్ని భుజాలపై మోసిన మంత్రి లోకేష్

అలాగే గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కళ్లితండాను మురళీ నాయక్ తండాగా పేరు మారుస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. జిల్లా హెడ్ క్వార్టర్‌లో మురళీ నాయక్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిసాయి. అంతిమ యాత్రలో పాల్గొని అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు మంత్రి లోకేష్ అక్కడే ఉన్నారు. అన్ని విధాలా అండగా ఉంటానంటూ మురళీ నాయక్ తల్లిదండ్రులకు లోకేష్ ధైర్యం చెప్పారు. మురళీ నాయక్ పార్థీవదేహాన్ని మంత్రి లోకేష్ భుజాలపై మోశారు. అధికార లాంఛనాల మధ్య మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు

ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి

For More AP News and Telugu News

Updated Date - May 11 , 2025 | 01:59 PM