MLA: ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:22 AM
ప్రజలం దరూ సామాజిక బాధ్యతగా ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి తేరు వీధిలో బుధవారం యోగాంధ్రా కార్యక్రమం నిర్వ హించారు. కలెక్టర్ టీఎస్ చేతన, జేసీ అభిషేక్కుమార్ ముఖ్య అతిథులుగా హా జరయ్యారు.

- యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట
-ప్రతిఒక్కరూ యోగా చేయాలి: కలెక్టర్ చేతన
కదిరి, జూన4 (ఆంధ్రజ్యోతి): ప్రజలం దరూ సామాజిక బాధ్యతగా ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి తేరు వీధిలో బుధవారం యోగాంధ్రా కార్యక్రమం నిర్వ హించారు. కలెక్టర్ టీఎస్ చేతన, జేసీ అభిషేక్కుమార్ ముఖ్య అతిథులుగా హా జరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్ర మం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ సా మాజిక బాధ్యతగా ఆరోగ్యాన్ని పరిరక్షించు కుంటే, దేశంలో ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందన్నారు. తద్వారా దేశాభివృద్ధి జరగుతుందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతిఒకరు యోగాసనాలు వేయడం వల్ల శారీరక, మానసిక రుగ్మతులు దూ రమవుతాయని పేర్కొన్నారు. పుట్టపర్తిలో గత నెల 21నుంచి యోగా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆరోగ్యం కోసం ప్రతి ఒకరు కొంత సమయాన్ని కేటాయించకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వీవీఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్యే పార్థసారఽథి. మున్సిపల్ చైర్పర్సన దిల్షాదున్నీషా, తహసీల్దార్ మురళీక్రిష్ణ, అన్ని శాఖఅ అధికారులు, పలువురు ప్రజలున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....