Share News

LAY OUT: వెలుగుచూస్తున్న జగనన్న కాలనీల అక్రమాలు

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:18 AM

మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట్లపల్లి సమీపంలో నిర్మించిన జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ జగనన్న కాలనీలో 1170 ఇళ్ల పట్టాలను గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేశారు. అయితే అప్పటి వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు పలువురు తమ చేతుల్లోకి పట్టాలు తీసుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకున్నట్లు సమాచారం.

LAY OUT: వెలుగుచూస్తున్న జగనన్న కాలనీల అక్రమాలు
Erraguntlapalli Jaganannakalani where the irregularities took place

కదిరి, జూన 13(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట్లపల్లి సమీపంలో నిర్మించిన జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ జగనన్న కాలనీలో 1170 ఇళ్ల పట్టాలను గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేశారు. అయితే అప్పటి వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు పలువురు తమ చేతుల్లోకి పట్టాలు తీసుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకున్నట్లు సమాచారం. దీనిపై గతంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రత్యే క కథనం ప్రచురించిన విషయం విదితమే. దీనిపై స్పందించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ జగనన్న కాలనీలో పర్యటించారు. ఆ కాలనీలో జరిగిన అవకతకలపై విచారణ జరపాలని అధికారులను ఆ దేశించారు.


అయితే కొన్నినెలలుగా ఽఅధికారులు ఆ విషయాన్ని పెడచెవిన పట్టారు. ఇటీవలే ఎమ్మెల్యే మరోసారి చొరవతీసుకుని గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన ఇంటిస్థలాలను పరిశీలించాలని, అక్రమాలుంటే బయట పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా మూడు జగన న్న కాలనీలు, బంగారు లక్ష్మణ్‌ కాలనీ, దేవానంద్‌కాలనీతో పాటు మరి కొన్ని సర్వే నెంబర్లలో విచారణచేయాలని ఆదేశించారు. ఆ మేరకు పది రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. తుది నివేదికను తయారు చేస్తున్నారు. ఎర్రగుంట్లపల్లి జగన్నకాలనీలో తమకు మోసం చేశారంటూ కొంతమంది లబ్ధిదారులు శుక్రవారం మీడియా ముందుకొచ్చారు. ఇందులో మాజీ వైస్‌ ఛైర్మన అజ్జుకుంట రాజశేఖర్‌ రెడ్డి పట్టాలు అమ్మినట్లు పలు వురు ఆరోపించారు. అలాగే కౌన్సిలర్‌ రంగారెడ్డి ఓ మహిళ వద్ద రూ.1. 20లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. తాను చిన్న కొట్టు పెట్టుకోవ డానికి రూ. 35వేలు ఇచ్చినట్లు మరో మహిళ తెలిపారు. దీంతోపాటు గత పది రోజులుగా జరిగిన విచారణలో వైసీపీ కౌన్సిలర్లతో పాటు ఇటీవల టీడీపీ లో చేరిన కౌన్సిలర్లు కూడా కొంతమంది పట్టాలు అమ్ముకున్న జాబితాలో ఉన్నట్లు సమాచారం. పూర్తి నివేదికలోస్తే , ఇందులో జరిగిన అక్రమాలు వెలుగుచూసే అవకాశముంది.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 14 , 2025 | 12:18 AM