MLA: గుంతల రోడ్లపై తట్టెడు మట్టి వేయించలేని అసమర్థుడు తోపుదుర్తి
ABN , Publish Date - May 20 , 2025 | 12:10 AM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ రోడ్లపై ఏర్పడిన గుంతలకు తట్టెడు మట్టి వేయించుకోలేని అసమర్థుడు తోపుదుర్తి ప్రకాశరెడ్డి అని ఎమ్మెల్యే పరిటాల సునీత ఎద్దేవ చేశారు. కనగానపల్లి మండలపరిధిలోని బాలెపాళ్యం- నెమలి వరం గ్రామాల మధ్య ఎనఆర్ఈజీఎస్ కింద రూ. 2కోట్లు నిధులతో నూతనంగా నిర్మించిన తారురోడ్డును సోమవారం ఎమ్మెల్యే ప్రారంభిం చారు.

- ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శ
- బాలెపాళ్యం- నెమలివరం తారురోడ్డు ప్రారంభం
చెన్నేకొత్తపల్లి, మే 19(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ రోడ్లపై ఏర్పడిన గుంతలకు తట్టెడు మట్టి వేయించుకోలేని అసమర్థుడు తోపుదుర్తి ప్రకాశరెడ్డి అని ఎమ్మెల్యే పరిటాల సునీత ఎద్దేవ చేశారు. కనగానపల్లి మండలపరిధిలోని బాలెపాళ్యం- నెమలి వరం గ్రామాల మధ్య ఎనఆర్ఈజీఎస్ కింద రూ. 2కోట్లు నిధులతో నూతనంగా నిర్మించిన తారురోడ్డును సోమవారం ఎమ్మెల్యే ప్రారంభిం చారు. కొన్నేళ్లుగా సరిగా రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడే వారమని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రోడ్డు వేసి తమ సమస్య పరిష్కరించారని ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ గ్రామానికి రోడ్డు సమస్య ఉందని అప్పటి సర్పంచ లక్ష్మీనారాయణ గతంలో చాలా సార్లు తన దృష్టికి తెచ్చారన్నారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవడం బాదాకరమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు వేసి గ్రామానికి వచ్చానన్నారు. గత వైసీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి టీడీపీ సానుభూతి పరులున్న గ్రామాల్లో గుంతలు పడ్డ రోడ్లకు కనీసం మట్టికూడా వేయలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు సమస్య లేకుండా చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ నారాయణస్వామి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ అనిల్కుమార్ డీసీసీ చైర్మన నెట్టెం వెంకటేశ, మార్కెట్యార్డ్ చైర్మన సుధాకర్చౌదరి, టీడీపీ మండల కన్వీనర్ యాతం పోతులయ్య, మాజీ ఎంపీపీ ముకుందనాయుడు, మాజీ జడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....