Home » Raptadu
మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట గ్రామానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నిర్మించడంతో తారురోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 44వ, 42వ జాతీయరహదారులకు పక్కనే ఉన్న ఈ గ్రామానికి రోడ్డు గుంతల మయంగా ఉంది.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ రోడ్లపై ఏర్పడిన గుంతలకు తట్టెడు మట్టి వేయించుకోలేని అసమర్థుడు తోపుదుర్తి ప్రకాశరెడ్డి అని ఎమ్మెల్యే పరిటాల సునీత ఎద్దేవ చేశారు. కనగానపల్లి మండలపరిధిలోని బాలెపాళ్యం- నెమలి వరం గ్రామాల మధ్య ఎనఆర్ఈజీఎస్ కింద రూ. 2కోట్లు నిధులతో నూతనంగా నిర్మించిన తారురోడ్డును సోమవారం ఎమ్మెల్యే ప్రారంభిం చారు.
రాప్తాడు నియోజకవ ర్గానికి త్వరలోనే మార్కెట్ యార్డును తీసుకొస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె సోమవారం నగరంలోని క్యాంపు కార్యాలయం లో రాప్తాడు మార్కెట్ యార్డు కమిటీ నూతన సభ్యులతో సమావేశం నిర్వహించారు. యార్డు చైర్మన సుధాకర్, వైస్ చైర్మన కృష్ణయ్యతో పాటు 15మంది డైరెక్టర్లు హాజరయ్యారు. వారు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు.
రాష్ట్రంలో, దేశ సరిహద్దుల్లో పురుగులు ఉన్నాయని, అన్నింటినీ ఏరి వేయాలని దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. మనల్ని రక్షించుకోవాలంటే చీడపురుగులకు పురుగుల మందు కొట్టాల్సిందేనన్నారు. మనదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదం ఉండకూడదని ఆయన ఆకాంక్షించారు. ధర్మం ఆధారంగా చంపడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు.
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే ఎమ్మెల్యే పరిటాల సునీత నసనకోట దుర్గమ్మ ఉత్సవాల ఏర్పాట్ల లో పాల్గొని శ్రమదానం చేశారు. నసనకోటలో వెలసిన దుర్గమ్మ ఉత్సవా లను చాలా సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున అబివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన సవరణ చేయాలని, ఇతర న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ అధికారులు ఆందోలన చేపట్టారు. నిరసనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కొనసాగించారు.
మండలం పరిధిలో పేద లకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు స్థల సేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె గురువారం సాయంత్రం మండల తహసీల్దార్ మోహన కుమార్తో పాటు హౌసింగ్ డీఈతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
అధైర్యపడకండి అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా ఇచ్చా రు. మండలంలోని పూలకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నారాయణస్వామి కుమారై రేణుక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
రామగిరి ఎస్ఐ సుధాకర్ యా దవ్పై వైసీపీ చేస్తున్న కుట్ర పూరిత రాజకీయాలను తిప్పి కొట్టడంతో పాటు ఆయనకు అండగా ఉంటామని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నక్కా రామారావు యాదవ భవనలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ సుధాకర్ నిబద్దతతో విధులు నిర్వహిస్తుంటే, ఆయనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు.
Paritala Sunitha Vs Jagan: జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ను జగన్ చదువుతున్నారని విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా పేపర్లు చూసి చదువుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా ఒక సంఘటన జరిగిందని.. కానీ దాన్ని కొడవండ్లు, మారుణాయుధాలు అంటున్నారన్నారు.