TDP : ఏడాది పాలనపై సంబరాలు
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:17 AM
రాష్ట్రంలో వైసీపీ వి ధ్వంసకపాలన అంతమై, టీడీపీ, జనసేన బీజేపీ సాధించిన విజ యం ప్రజావిజయమని తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యదర్శి సామ కోటి ఆదినారాయణ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాది పాల న పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నాయకులు బుధవారం పట్ణణంలోని హనుమానకూడలిలో కేక్కట్ చేసి సంబరాలు చే సుకున్నారు.

పుట్టపర్తిరూరల్, జూన 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ వి ధ్వంసకపాలన అంతమై, టీడీపీ, జనసేన బీజేపీ సాధించిన విజ యం ప్రజావిజయమని తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యదర్శి సామ కోటి ఆదినారాయణ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాది పాల న పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నాయకులు బుధవారం పట్ణణంలోని హనుమానకూడలిలో కేక్కట్ చేసి సంబరాలు చే సుకున్నారు. ఈ సందర్భంగా సామకోటి మాట్లాడుతూ.. వైసీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి, తెలుగుదేశంపార్టీకి చారిత్రకమైన అఖండమైన ప్రజాతీర్పు రావడంతో రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా ప్రారంభమైందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం రాషా్ట్రన్ని అభివృద్ధి పథంలో నడిపి స్తూ, ప్రజల ఆకాంక్షలన్నింటిని తప్పక నెరవేరుస్తుందన్నారు. కార్య క్రమంలో నాయకులు తలిపినేని చెన్నకేశవులు, రాజప్ప, బేకరి నాయడు, భీమినేని కిష్టప్ప, గూడూరు శంకర్, పుట్టపోతన్న, సోమశేఖర్రెడ్డి, కార్తకర్తలు, పట్టణప్రజలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....