CROP: నష్టాల బాటలో బూడిద గుమ్మడి రైతులు
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:13 AM
మండల వ్యాప్తంగా పలువురు రైతులు బూడిద గుమ్మడి పంట సాగుచేశారు. అయితే ఈ యేడాది ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్ట పోయామని రైతులు వాపోతున్నారు. రబీలో వ్యవసాయ బోర్ల కింద తీగజాతి బూడిదగుమ్మడిని సాగుచేశారు. గతయేడాది మంచి లాభాలు రావడంతో, ఈ యేడాది కూడా ఆశించిన ధరలు ఉంటాయని ఎంతో భావించారు.

గాండ్లపెంట, జూన 7(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా పలువురు రైతులు బూడిద గుమ్మడి పంట సాగుచేశారు. అయితే ఈ యేడాది ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్ట పోయామని రైతులు వాపోతున్నారు. రబీలో వ్యవసాయ బోర్ల కింద తీగజాతి బూడిదగుమ్మడిని సాగుచేశారు. గతయేడాది మంచి లాభాలు రావడంతో, ఈ యేడాది కూడా ఆశించిన ధరలు ఉంటాయని ఎంతో భావించారు. దీంతో రైతులు మండలంలో దాదాపు 400 ఎకరాలకుపైగా బూడిద గుమ్మడి సాగుచేశారు. పంట సాగు కోసం ఎకరాకు రూ. 30వేలు ఖర్చు చేసినట్లు రైతులు తెలుపుతున్నారు. అయితే ఈ యేడాది ధరలు పూర్తిగా పతనం కావడంతో రైతులు కాయలను పొలాల్లోనే వదిలేశారు. ప్రస్తుత ధరలతో పెట్టబడులు కూడా రాకపోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బూడిదగుమ్మడి పంట సాగుచేసి, నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....