MANROE: అనంత ఆత్మబంధువు మన్రో
ABN , Publish Date - May 28 , 2025 | 12:08 AM
రాయలసీమ అభివృద్ధికి కృషి చేసిన సర్ థామస్ మన్రో అనంత ఆత్మబంధువుగా ప్రజ ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సీనియర్ రచయిత డాక్టర్ పతికి రమేష్ నారాయణ అన్నారు. మర్రో 264వ జయంతిని పురస్క రించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ కూడలి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతపురం కల్చరల్, మే 27 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ అభివృద్ధికి కృషి చేసిన సర్ థామస్ మన్రో అనంత ఆత్మబంధువుగా ప్రజ ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సీనియర్ రచయిత డాక్టర్ పతికి రమేష్ నారాయణ అన్నారు. మర్రో 264వ జయంతిని పురస్క రించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ కూడలి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మన్రో మెమోరియల్ ట్రస్టు చైర్మన తోట నాగరాజు, తెలుగు వెలుగు సంస్థ అధ్యక్షుడు టీవీ రెడ్డి, కేపీ రాజు, మహాబోధి సాహిత్య వేదిక అధ్యక్షుడు దాసన్నగారి కృష్ణమూర్తి, ఏజీ అనిల్ కుమార్, షేక్ రియాజుద్దీన, అంకె రామలింగయ్య, కోగిర జయచంద్ర, భీమసేనరావు, పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....