sports కడపపై అనంత జట్టు గెలుపు
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:09 AM
ఏసీఏ క్రికెట్ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన ఆధ్వర్యంలో కడప నగరంలోని వైఎస్సార్ స్టేడియంలో జిల్లా అం డర్-23 ఛాంపియనషి్ప పోటీల్లో శనివారం కడప జట్టుతో జిల్లా జట్టు తలపడింది.

అనంతపురం క్లాక్టవర్, జూన 7 (ఆంధ్రజ్యోతి): ఏసీఏ క్రికెట్ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన ఆధ్వర్యంలో కడప నగరంలోని వైఎస్సార్ స్టేడియంలో జిల్లా అం డర్-23 ఛాంపియనషి్ప పోటీల్లో శనివారం కడప జట్టుతో జిల్లా జట్టు తలపడింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కడప జట్టు 35.2ఓవర్లలో 151పరుగులకు ఆలౌటైంది. అనంత బౌలర్ దీపక్ 4వికెట్లు, మల్లికార్జున 3, కమిల్ 3వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన అనంత పురం జట్టు 22.2ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 155పరుగులు చేసి విజయం సాధించింది. ఇందులో జిల్లా బ్యాటర్ కేహెచ వీరారెడ్డి 34 పరుగులు చేశాడు. దీంతో అనంతపురం జిల్లా జట్టు 12పాయుంట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జట్టుకు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీమలింగారెడ్డి అభినందనలు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..