Share News

Vijayawada : కృష్ణా నదిలో ఈత పోటీలు

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:48 AM

స్విమ్మింగ్‌ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి 600 మంది స్విమ్మర్లు ఈ పోటీలకు హాజరయ్యారు.

 Vijayawada : కృష్ణా నదిలో ఈత పోటీలు

  • వివిధ రాష్ట్రాల నుంచి 600 మంది రాక

విజయవాడ (వన్‌టౌన్‌), ఫిబ్రవరి 2: కృష్ణా నదిలో దుర్గాఘాట్‌ వద్ద 25వ కృష్ణా రివర్‌ క్రాస్‌ స్విమ్మింగ్‌ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి 600 మంది స్విమ్మర్లు ఈ పోటీలకు హాజరయ్యారు. పదేళ్ల నుంచి 80 సంవత్సరాల వయస్సు వాళ్లు పోటీల్లో పాల్గొన్నారు. ఈత పోటీలను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం ఏడు వయసు కేటగిరీల్లో పోటీలు జరిగాయి. అమరావతి ఫెస్టివల్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ కామినేని పట్టాభిరామయ్య, బీజేపీ రాష్ట్ర నాయకుడు పాతూరి నాగభూషణం ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 03 , 2025 | 04:48 AM