Chandrababu: జన ‘చంద్ర’మైన ‘రా.. కదలిరా’ సభ
ABN, Publish Date - Jan 30 , 2024 | 01:09 PM
తూర్పుగోదావరి జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘రా కదలిరా’ సభ జన ‘చంద్ర’మైంది. నగరం జనంతో పోటెత్తింది. దారులన్నీ జనదారులుగా మారిపోయాయి. వాహనాలు కిలోమీటర్ల లెక్కన బారులు తీరాయి. ఎటుచూసినా, ఎక్కడ చూసిన జనమే. చేల గట్లు రహదారులయ్యాయి. సభా ప్రాంగణం అంతా జై టీడీపీ, జై జనసేన నినాదాలతో హోరెత్తింది.

రాజమండ్రి, కాతేరు గ్రామంలో జరిగిన ‘రా..కదలిరా’ బహిరంగ సభకు ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వర్గీయ నందమూరి తారక రామావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం. ప్రక్కన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ నేతలను చూడవచ్చు.

రాజమండ్రి, కాతేరు గ్రామంలో జరిగిన ‘రా..కదలిరా’ బహిరంగ సభకు విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కిరీటం, శాలువ కప్పి సన్మానం చేస్తున్న టీడీపీ నేతలు..

రా కదిలి రా బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.

తెలుగుదేశం పిలుస్తోంది ‘రా కదలిరా’ సభకు ఉత్సాహంగా తరలి వచ్చిన ప్రజలు.. చంద్రబాబు రాకకు రెండు గంటల ముందే జనంతో సభ కిట కిట..

‘రా కదలిరా’ సభకు ఉత్సాహంగా తరలి వచ్చిన ప్రజలకు చేయెత్తి అభివాదం తెలుపుతున్న చంద్రబాబు నాయుడు..

రాజమండ్రి, కాతేరు గ్రామంలో సోమవరం చంద్రబాబు నిర్వహించిన ‘రా కదిలి రా’ సభకు వెల్లువలా తరలివచ్చిన మహిళలు..
Updated at - Jan 30 , 2024 | 01:09 PM