Home » Railway News
Jan Sadharan Express Derails: బోగీలు పట్టాలు తప్పిన సమయలో పెద్ద శబ్ధం వచ్చింది. ఆ శబ్ధం వినపడగానే కొంతమంది ప్రయాణికులు భయపడిపోయారు. రైలులోంచి కిందకు దూకేశారు. అయినప్పటికీ వారికీ ఏమీ కాలేదు.
టెన్త్, ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులకు రైల్వేలో పనిచేసేందుకు గొప్ప ఛాన్స్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యువతకు రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. 1,000 మందికి పైగా ఈ నియామాకం కింద నియమించుకోనున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోండి.
హైటెక్ హంగులతో ఉప్పుగూడ రైల్వేస్టేషన్ను ఆధునీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకంలో భాగంగా రూ.26.81 కోట్లతో ఈ స్టేషన్లో చేపట్టిన పునరభివృద్ధి పనులు డిసెంబరు ఆఖరుకల్లా పూర్తి కానున్నాయని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
అతిపెద్ద మహిళల అక్రమ రవాణా గుట్టును రైల్వే పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి బిహార్ తరలిస్తున్న 56 మంది యువతులను కాపాడారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దుర్మార్గానికి పాల్పడిన ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఆధార్ వివరాలు లేకుండానే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా రైల్వే సిబ్బంది తత్కాల్ టికెట్లను అందిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 1 నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో తత్కాల్ టికెట్లు
రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్. ఇకపై టికెట్ బుకింగ్ చేయడం అంత ఈజీ కాదు. ప్రధానంగా తత్కాల్ టికెట్ల విషయంలో అనధికారికంగా టికెట్లు బుక్ చేయడాన్ని నిరోధించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ చేసే ముందు ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు.
ప్రయాణికుల భద్రతను పెంచే దిశగా రేల్వే శాఖ కీలక ముందడుగు వేసింది...
ప్రయాణీకుల భద్రతపై ఫోకస్ చేసిన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు అన్ని రైల్వే కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ప్రయాణీకుల భద్రతను పెంచడమే కాకుండా, రైళ్లలో చోరీలు, ఇతర అక్రమ కార్యకలాపాల వంటివి తగ్గనున్నాయి.
Train Fire: మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామన్నారు. ఇక, ఈ ప్రమాదంలో మనుషులు గాయపడ్డం, చనిపోవటం వంటివి జరగలేదు.
నిరుద్యోగులకు మంచిఛాన్స్. 2025-26 సంవత్సరానికి గానూ ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 50,000లకు పైగా పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. అభ్యర్థులకు సమీపంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగులుర, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.