Home » Local Body Elections
తిరువనంతపురంలో ఇంతకుముందు 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగగా, ఎల్డీఎఫ్ 52 వార్డులు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 33 వార్డులు, యూడీఎఫ్ 10 వార్డులు దక్కించుకున్నాయి.
తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.
పంచాయతీ పోలింగ్ సమీపించడంతో అభ్యర్థు ల్లో టెన్షన్ మొదలైంది. ఇన్ని రోజులుగా సాధారణంగా కనిపించిన అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైంది.
కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు దేనికైనా తగ్గేదేలేదంటున్నారు. అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నెగ్గేందుకు సిద్ధమవుతున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాలకు ఎన్నికలు జరగనుండగా ఈనెల 11న పోలింగ్ జరగనుంది.
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు భారీ మొత్తంలో మద్యం, మటన్, విందులతో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ఖర్చుల్లో ఎక్కువ భాగం మద్యంపైనే వెచ్చిస్తున్నారు. అభ్యర్థులు ప్రలోభాల ద్వారానే అధికంగా ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
వరంగల్ జిల్లాలో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన తర్వాత, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాగా అధికారులు పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 11న పోలింగ్ జరుగనుంది.