Home » iphone users
ఫోన్ల యందు యాపిల్ ఫోన్లు వేరయా.. అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాటికున్న క్రేజ్ అలాంటిది. ఐఫోన్లకు అంత క్రేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో సెక్యూరిటీ మొదటి స్థానంలో ఉంటుంది. యాపిల్ వస్తువులు వాడే వారి డేటాకు ఎలాంటి భయం లేదని కంపెనీ తెగ ప్రచారం చేస్తూ ఉంటుంది.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇండియాలో ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెక్ ప్రియులు. ఇటీవలి కాలంలో ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక వార్తలు, ఫీచర్లకు సంబంధించిన లీక్లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. మరి, టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ పై ప్రకటించిన ఆఫర్లు, ఈ సిరీస్లో ఉండబోయే ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాలు ప్రారంభమవుతున్నాయనే వార్త వచ్చిన వెంటనే కస్టమర్లు తమ కొత్త ఫోన్లను కొనుగోలు చేయడానికి స్టోర్ వెలుపల భారీగా బారులు తీరారు. ఈ క్రమంలో దేశంలోని ముంబై, ఢిల్లీలో స్టోర్ల బయట జనాలు పెద్ద ఎత్తున ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యాపిల్ ఉత్పత్తుల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్, ఐప్యాడ్స్, మ్యాక్బుక్స్ సహా ఇతర యాపిల్ పరికరాలకు ‘హై రిస్క్’ అలర్ట్ ఇచ్చింది.
భారత్తోపాటు.. 98 దేశాల ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ‘కిరాయి స్పైవేర్’ దాడులు జరుగుతున్నాయని అప్రమత్తం చేసింది.
గత రెండు నెలల్లో రూ.16 వేల 500 కోట్ల ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి(iPhones Exports) అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లోనే 2 బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన ఐఫోన్లను ఎగుమతి చేయడం మేడ్ ఇన్ ఇండియా సంకల్పానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఐఫోన్ ఉన్న వారికి సిరి గురించి తెలియకుండా ఉంటుందా చెప్పండి. అయితే తొలిసారి ఐఫోన్ కొన్న యూజర్లకు సిరి టెక్నాలజీపై అవగాహన ఉండకపోవచ్చు. సిరి ఉంటే(Hey, Siri!) టెక్ట్సింగ్, కాలింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇలా ఎన్నో పనులు నోటితో అయిపోతాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్లిప్కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఇది ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది.ఈ సేల్లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు మొదలైన గ్యాడ్జెట్లపై ఫ్లిప్కార్ట్ గణనీయమైన తగ్గింపులను చేసింది.
భారత్లో యాపిల్ ఐఫోన్ల(Apple Iphones) ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు బ్లూమ్ బర్గ్(Bloomberg) నివేదిక వెల్లడించింది. బుధవారం వెలువడిన ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. 2023లో భారత్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది.
మీరు ఐఫోన్ వాడుతున్నారా? మీ డేటాకు సంబంధించి కేంద్రం చేసిన పలు సూచనలు ఐఫోన్ వినియోగదారులకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ యాపిల్ యూజర్లకు హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది.