• Home » Election Campaign

Election Campaign

బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత

బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత

భారతీయ జనతా పార్టీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీని 'అనాగరిక' పార్టీగా అభివర్ణించారు. దేశంలో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్ చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

 యుద్ధం తమిళనాడు, ఢిల్లీ మధ్యే: ఉదయనిధి స్టాలిన్

యుద్ధం తమిళనాడు, ఢిల్లీ మధ్యే: ఉదయనిధి స్టాలిన్

అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామికి ఉద్వాసన పలకాలని, తద్వారా బీజేపీ మాయమాటలకు తమిళనాడు లొంగదని బలంగా చాటిచెప్పాలని డీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.

మంత్రి శశి పంజా ఇంటిపై రాళ్ల దాడి.. యుద్ధక్షేత్రంగా మారిన కోల్‌కతా!

మంత్రి శశి పంజా ఇంటిపై రాళ్ల దాడి.. యుద్ధక్షేత్రంగా మారిన కోల్‌కతా!

అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణతో కోల్‌కతా నగరం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. రాష్ట్ర మంత్రి శశి పంజా నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైంది.

తమిళనాడు ఎన్నికలపై కేకే సర్వే.. ఆ పార్టీనే అధికారంలోకి..

తమిళనాడు ఎన్నికలపై కేకే సర్వే.. ఆ పార్టీనే అధికారంలోకి..

త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ డీఎంకే ప్రభుత్వమే ఏర్పడనుందని హైదరాబాద్‌కు చెందిన ‘పారావీల్‌ కేకే సర్వేస్‌ అండ్‌ స్ట్రాటజీస్‌’ ప్రకటించింది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ ఒక అంచనాకు వచ్చింది.

‘సర్’ రివిజన్‌కు సన్నాహక పనులు త్వరగా పూర్తి చేయాలి.. రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

‘సర్’ రివిజన్‌కు సన్నాహక పనులు త్వరగా పూర్తి చేయాలి.. రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో జరిగే ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సన్నాహకాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచిస్తూ ఎన్నికల అధికారులు లేఖ రాశారు..

బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు

బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు

కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేయడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ వేళ పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా

మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ అభ్యర్థి మృతిచెందడంతో ఆరో వార్డులో పోలింగ్‌ను వాయిదా వేశారు అధికారులు.

ఓటరన్న కరుణించేదెవరినో..?

ఓటరన్న కరుణించేదెవరినో..?

మున్సిపల్‌ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటరన్న ఎవరిని కరుణిస్తాడోనని ఆయా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

తాయిలాలు సమర్పయామి..!

తాయిలాలు సమర్పయామి..!

ఓటర్లను సంతృప్తిపరచాలి.. ఎంత ఖర్చయినా పెట్టాలి.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి.. ఏ పార్టీ అభ్యర్థి అయినా చేసేదిదే..!! రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఇదే లక్ష్యంతో విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి