Home » Drunk and Drive
నగరంలో.. మద్యం ప్రియుల తీరు మారడం లేదు. మద్యం సేవించడం.., వాహనాలు తీసుకొని రోడ్లపైకి రావడం షరా మామూలుగానే మారిపోయింది. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహాస్తున్నా.. డోంట్ కేర్ అంటూ దర్జాగా రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు.
Drunk And Drive: వికారాబాద్ జిల్లాలో గత రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పరిగిలో ఓ మందుబాబు పోలీసులకే చుక్కలు చూపించాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్లో అతడు మద్యం తాగినట్లు బయటపడింది.
Drunk Driving Incident: టోలీచౌకి ఫ్లై ఓవర్పై ఓ వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి హల్చల్ చేశాడు. అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో మద్యం సేవిస్తూ యదేచ్ఛగా వాహనాన్ని నడిపాడు ఆ మందుబాబు. కారు నడపడం కూడా మామూలుగా కాదండయో.. అత్యంత వేగంగా వాహనాన్ని నడిపాడు.
డ్రైవింగ్ సీట్లో కూర్చున్నోడు పూటుగా మద్యం తాగి, ఆ మత్తులో నడుపుతున్నాడు! అతడి ఈ నిర్లక్ష్యమే ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది! ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలకు మద్యం భారీగా కొనుగోలు చేసేశారు. మద్యం ప్రియులు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశారు. డిసెంబరు నెల చివరి 9 రోజుల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 రోజుల్లోనే రూ.2166 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
మద్యం మత్తులో కారు నడిపి డివైడర్కు ఢీకొట్టడమే కాకుండా పోలీసులను దుర్భాషలాడిన ఇద్దరు యువతీయువకులకు కోర్టు బెయిలిస్తూనే విచిత్రమైన షరతులు విధించింది.
Telangana: రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న (డిసెంబర్ 31) 10 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. మందు సేవించి వాహనం నడిపిన అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మందుబాబులకు అర్ధరాత్రి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ను ప్రవేశపెట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ తనిఖీలను ముమ్మరంగా నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా..యువతలో మార్పు రావడం లేదు. ఫలితంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.
హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వాళ్లలో సెలబ్రిటీలను మాత్రమే చూశాం. అయితే హైదరాబాద్లో ఓ పోలీస్ ఉన్నతాధికారి పట్టుబడ్డారు. బుధవారం రాత్రి పోలీసులు మధురానగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సివిల్ డ్రెస్సులో వస్తు్న్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు.
గోల్కొండ ఇబ్రహీంబాగ్లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు ఓ బాలుడి ప్రాణాలు తీసింది. డిగ్రీ చదువుతున్న యువకుడు మద్యంమత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ ప్రాణాన్ని బలితీసుకోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.