Share News

Hyderabad: మారని మద్యం ప్రియులు.. ఒక్కనెలలో ఎన్ని డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో తెలుసా..

ABN , Publish Date - May 14 , 2025 | 07:00 AM

నగరంలో.. మద్యం ప్రియుల తీరు మారడం లేదు. మద్యం సేవించడం.., వాహనాలు తీసుకొని రోడ్లపైకి రావడం షరా మామూలుగానే మారిపోయింది. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహాస్తున్నా.. డోంట్ కేర్ అంటూ దర్జాగా రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు.

Hyderabad: మారని మద్యం ప్రియులు.. ఒక్కనెలలో ఎన్ని  డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో తెలుసా..

- సైబరాబాద్‌లో నెలకు 1,100కు పైగా డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

హైదరాబాద్‌ సిటీ: మద్యం ప్రియులు మారడం లేదు. పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌(Drunken drive) తనిఖీ చేపట్టి కేసును మోదు చేస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి కారణమైతే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా మద్యం తాగి వాహనాలను నడుపుతూనే ఉన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధిలో ప్రతీ నెల 1,100కు పైగా డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదవుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Wife Kills Husband: భర్తను చంపి, ఐదు ముక్కలుగా నరికిన భార్య.. కారణం ఏంటో తెలుసా?


city1.2.jpg

ఈ ఏడాది మార్చి నెలలో 1,115, ఏప్రిల్‌లో 1,049 కేసులు నమోదయ్యాయని పోలీసులు పేర్కొంటున్నారు. మద్యం తాగి వాహనాలను నడిపి పట్టుబడిన వారిలో ఎక్కువ మంది 21-40 ఏళ్ల వాయస్సు వారు, ద్విచక్రవాహనదారులు అధికంగా ఉన్నట్లు పోలీసులు విడుదల చేస్తున్న వివరాలను బట్టి తెలుస్తోంది. చాలామంది విద్యావంతులు, ఉద్యోగులు సైతం డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడుతున్న సంఘటనలు ఉన్నాయి. ప్రజలు రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు

కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు

ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?

నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!

దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!

Read Latest Telangana News and National News

Updated Date - May 14 , 2025 | 07:00 AM