Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్తో రైడ్.. వీడియో వైరల్
ABN , Publish Date - May 05 , 2025 | 11:00 AM
Drunk Driving Incident: టోలీచౌకి ఫ్లై ఓవర్పై ఓ వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి హల్చల్ చేశాడు. అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో మద్యం సేవిస్తూ యదేచ్ఛగా వాహనాన్ని నడిపాడు ఆ మందుబాబు. కారు నడపడం కూడా మామూలుగా కాదండయో.. అత్యంత వేగంగా వాహనాన్ని నడిపాడు.

హైదరాబాద్, మే 5: భాగ్యనగరంలో మందు బాబులు రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ (Drunk And Driving) చేయరాదని పోలీసులు ఎన్ని సార్లు చెప్పినప్పటికీ మందుబాబులు తమ పందాను వీడటం లేదు. మరింతగా రెచ్చిపోయి మద్యం తాగి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన వారిని పట్టుకోవడం.. చలానా వేయడం.. అవసరమైతే శిక్ష వేయడం కూడా జరుగుతోంది. అయినప్పటికీ మేం ఇంతే అన్నట్లుగా మందు బాబులు పెట్రేగిపోతున్నారు. పోలీసులు ఉంటారన్న భయం లేకుండా మందు తాగేసి విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. వీరి వల్ల ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా రోడ్డు ప్రమాదాలకు కూడా వీరు కారకులుగా నిలుస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో (Hyderabad) ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మద్యం సేవిస్తూ యదేచ్ఛగా వాహనాన్ని నడిపాడు ఓ వ్యక్తి. ఇతగాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టోలీచౌకి ఫ్లై ఓవర్పై ఓ వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి హల్చల్ చేశాడు. అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో మద్యం సేవిస్తూ యదేచ్ఛగా వాహనాన్ని నడిపాడు ఆ మందుబాబు.కారు నడపడం కూడా మామూలుగా కాదండయో.. అత్యంత వేగంగా వాహనాన్ని నడిపాడు. ఇతగాడు మద్యం సేవిస్తూ వాహనాన్ని నడుపటాన్ని ఓ బైకర్ వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ఇలా మద్యం సేవించి అడ్డదిడ్డంగా వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి పట్ల నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చేసి ఎంత మంది ప్రాణాలను బలితీసుకుంటారని మండిపడుతున్నారు.
Pakistan Army: కాల్పుల విరమణకు తూట్లు.. 11వ రోజు కూడా అదే దుర్మార్గం..
డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నప్పటికీ మందు బాబులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. విషయం తెలిసిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. షాకింగ్ విషయాలు బయటకు వచ్చారు. మురళీ కృష్ణ గౌడ్ అనే వ్యక్తి పేరుపై వాహనం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వాహనంపై ఇది వరకే డేంజరస్ డ్రైవింగ్ చలనాలు ఉన్నట్లు బయటపడింది. ఈ క్రమంలో సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నారు. మద్యం సేవిస్తూ వాహనం నడిపిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మద్యం సేవిస్తూ వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
Metro Fare Rise: 10 నుంచి మెట్రో చార్జీల పెంపు
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read Latest Telangana News And Telugu News