Home » Apple
టెక్ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ WWDC 2025 ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. టెక్ దిగ్గజం ఆపిల్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ను జూన్ 9న ఘనంగా ప్రారంభించనుంది. 5 రోజులపాటు కొనసాగనున్న ఈ ఈవెంట్లో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు సహా కీలక అప్డేట్స్ ప్రకటించనున్నారు.
చాలా రోజుల నుంచి మీరు యాపిల్ MacBook కొనాలని అనుకుంటున్నారా. అయితే మీకు ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే MacBook Air M1పై ప్రస్తుతం 31 వేల తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.
ఇకపై భారత్లో ఐఫోన్, మ్యాక్బుక్ రిపేరింగ్ బాధ్యతలను టాటా గ్రూప్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
చైనాపై సుంకాలు పెంచిన నేపథ్యంలో తన తయారీని భారత్కు మార్చే ప్రయత్నాల్లో ఉన్న యాపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలో తయారుచేయకపోతే వాటిపై 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు.
ట్రంప్ సుంకాల దెబ్బకు ఐఫోన్ల ధరలు పెరగడంతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లు అనేక మంది ప్రస్తుతం పాత ఫోన్లను రిపేర్ చేయించుకునేందుకే మొగ్గు చూపుతున్నారు.
అమెరికాలో తయారయ్యే ఐఫోన్ల ధరలు ప్రస్తుతం కంటే మూడు రెట్లు అధికంగా ఉంటాయంటూ ఇండ్ట్రీకి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Trump Warning To Apple: ఖతార్లో ట్రంప్, యాపిల్ ఈసీవో టిమ్కుక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్లాంట్ ఏర్పాటుపై చర్చ జరిగింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యాపిల్ ఇండియాలో ప్లాంట్ పెట్టాలనుకోవటంపై ట్రంప్ అడ్డు చెప్పారు.
టెక్ దిగ్గజం ఆపిల్ వాయిస్ అసిస్టెంట్ సిరి వినియోగదారుల అనుమతి లేకుండా వారి డేటాను రికార్డ్ చేసిందంటూ ఆరోపించిన క్లాస్ యాక్షన్ దావాను పరిష్కరించడానికి.. సదరు కంపెనీ 95 మిలియన్ డాలర్లు (రూ.810 కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ..
టెక్ ప్రియులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆపిల్ 2027లో కీలక ప్రకటనలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ డిజైన్లో మార్పు, ఫోల్డబుల్ ఫోన్ సహా పలు అంశాలు ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆపిల్ కంపెనీ ఐఫోన్ల తయారీ యూనిట్ను చైనా నుంచి భారత్కు తరలించాలనే యోచనలో ఉంది. ట్రంప్ విధించిన సుంకాలు, చైనా మీద ఆధారత తగ్గించాలన్న వ్యూహం ఇందుకు కారణంగా కనిపిస్తోంది