ఇదీ వైసీపీ తీరు.. కథ వినిపించిన లోకేష్
ABN, First Publish Date - 2025-03-12T12:16:35+05:30 IST
Lokesh response YSRCP protests: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలపై మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు వాళ్లే పెట్టి తిరిగి వాళ్లే ధర్నాలు చేయడం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు.
అమరావతి, మార్చి 12: ఏపీ మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లించాలంటూ సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ (Minister Lokesh) స్పందిస్తూ.. ఫీజ్ రీయింబర్స్మెంట్పై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు కూడా ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. ఫీజు పోరు అని పేరు పెట్టి.. యువత పోరుగా మార్చారన్నారు. ఏ అంశంపై పోరాడుతున్నారో వైసీపీకే స్పష్టత లేదన్నారు. ఈ సందర్భంగా సభలో ఓ కథ వినిపించారు మంత్రి. ‘జడ్డి ముందుకు ఓ నిందితుడిని తీసుకువెళ్లగా.. తనకు అమ్మానాన్న లేరని, అనాధను అంటూ వాపోయాడు ఆ నిందితుడు. ఇదేంటని పోలీసులను జడ్జి ప్రశ్నించగా.. అమ్మా, నాన్నను చంపాడు కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చామని చెప్పారు పోలీసులు’.. ఇదే విధంగా ఉంది వైసీపీ తీరంటూ మండిపడ్డారు.
వాళ్లే ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు వారే పెట్టి మళ్లీ వారే ధర్నాలు చేస్తున్నారని, వైసీపీ వాళ్లే విద్యాత్ చార్జీలు పెంచీ.. తిరిగి వాళ్లే ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజీరీయింబర్స్మెంట్పై షార్ట్ డిష్కన్కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి లోకేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Telangana Assembly budget session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం ఇదే
AP Legislative Council: సభ మొదలవగానే షూరూ చేసిన వైసీపీ..
Read Latest AP News And Telugu News
Updated at - 2025-03-12T12:21:54+05:30