పవన్పై కుట్ర చేసే దమ్ము ఎవరికీ లేదు
ABN, Publish Date - May 31 , 2025 | 01:10 PM
R Narayana Murthy: పర్సంటేజ్లు ఖరారైతే తన లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని నటుడు ఆర్ నారాయణమూర్తి తెలిపారు. డిప్యూపీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎవరు కుట్ర చేస్తారని ప్రశ్నించారు. ఆయనపై కుట్ర చేసే దమ్ము ఎవరికీ దమ్ము లేదన్నారు.
హైదరాబాద్, మే 31: థియేటర్స్ పర్సంటేజ్ విధానంపై చర్చ నడుస్తోందని నటుడు, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి (R Narayanamurthy) తెలిపారు. హారిహర వీరమల్లు సినిమాకు ముందు థియేటర్ల బంద్పై కుట్ర ఉందని.. దాన్ని వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని మంత్రి కందుల దుర్గేష్ అనటం కరెక్ట్ కాదన్నారు. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధమన్నారు. పర్సంటేజ్లు ఖరారైతే తన లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు.
డిప్యూపీ సీఎం పవన్ కళ్యాణ్పై (Deputy CM Pawan Kalyan) ఎవరు కుట్ర చేస్తారని ప్రశ్నించారు. పవన్పై కుట్ర చేసే దమ్ము ఎవరికీ దమ్ము లేదన్నారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదన్నారు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్పై గౌరవం మరింత పెరిగేదని అన్నారు. బంద్ అనేది బ్రహ్మాస్తం అని చెప్పుకొచ్చారు. సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
విజయవాడలో యోగాంధ్ర.. పాల్గొన్న రైతులు
Read Latest Telangana News And Telugu News
Updated at - May 31 , 2025 | 01:48 PM