నంబాల కేశవరావు మృతిపై గ్రామస్తుల స్పందన
ABN, Publish Date - May 22 , 2025 | 04:58 PM
Nambala Keshav Rao Death: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేశవరావు మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
శ్రీకాకుళం, మే 22: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు (Nambala Keshava Rao) అలియాస్ బసవరాజు మృతి చెందాడు. నంబాల మృతితో శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామం జీఅన్న పేటలో విషాదఛాయలు అలముకొన్నాయి. సుమారు ఐదు దశాబ్ధాలుగా ఉద్యమంలో పనిచేసిన కేశవరావు మృతిచెందారు అన్న వార్తను జీఅన్న పేట గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. 50ఏళ్ల నక్సల్స్ ప్రస్థానంలో నంబాలది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు.
మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో నక్సల్స్ ఉద్యమాన్ని ముందుండి నడిపించే అగ్రనాయకుడిగా నంబాలకు పేరుంది. అలాంటి నంబాల ఎన్కౌంటర్లో మృతి చెందారని తెలిసి స్వగ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Tirumala: తిరుమలలో ఓ వ్యక్తి బహిరంగంగా చేసిన పని చూస్తే
AP Ration Card: రేషన్కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ
Read latest AP News And Telugu News
Updated at - May 22 , 2025 | 05:05 PM