మిస్వరల్డ్ టైటిల్ సాధించిన ఆరుగురు భారతీయులు వీరే
ABN, Publish Date - May 24 , 2025 | 12:32 PM
Miss World: మిస్ వరల్డ్ పోటీల్లో 1966లో ఇండియా మొదటి సారి టైటిల్ గెలుచుకుంది. రీటా ఫరియా ఇండియాకు మొట్టమొదటి మిస్ వరల్డ్ టైటిల్ను అందించింది.
హైదరాబాద్, మే 24: మిస్ వరల్డ్ టాప్-20లో (Miss World 2025) భారత్ ముద్దుగుమ్మ నందిని గుప్తాకు చోటు దక్కకపోయినా గతంలో భారత దేశం నుంచి మిస్ వరల్డ్ పోటీలో ఆరు సార్లు కిరీటం సాధించారు మన ముద్దుగుమ్మలు. ప్రపంచ సుందరిగా ఇప్పటి వరకు గెలిచిన ఆరుగురు అందెగత్తెల్లో మొదటి వ్యక్తి రీటా ఫరియా. మిస్ వరల్డ్ పోటీల్లో 1966లో ఇండియా మొదటి సారి టైటిల్ గెలుచుకుంది. ఈ కాంపిటీషన్లో భారత్ను రీప్రసెంట్ చేస్తూ రీటా ఫరియా ప్రపంచ సుందరిగా నిలిచింది. మెడికల్ స్టూడెంట్ అయిన రీటా మోడలింగ్ వైపు కెరియర్ను మలుచుకుంది.
ఇండియాకు మొట్టమొదటి మిస్ వరల్డ్ టైటిల్ను అందించింది. ప్రపంచ సుందరి అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఐశ్వర్యారాయ్. ఈ భామ 1994లో మిస్ వరల్డ్ పోటీలో ఇండియాను రీప్రసెంట్ చేస్తూ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. తన నీలికళ్ల సోయగయంతో భారతీయులనే కాదు ప్రపంచాన్ని కట్టిపడేసింది ఐశ్వర్యారాయ్. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
కాక రేపుతున్న కవిత లేఖ.. కేటీఆర్ ఏమన్నారంటే
బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..
Read latest Telangana News And Telugu News
Updated at - May 24 , 2025 | 12:33 PM