Share News

Miss World Contestants: వరంగల్ పర్యటనకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్..

ABN , Publish Date - May 14 , 2025 | 08:23 AM

Miss World Contestants: అందాల భామలు బుధవారం వరంగల్, ములుగు జిల్లాలో పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. 35 మందితో కూడిన సుందరీమణులతో కూడిన ఒక బృందం వరంగల్ నగరంలోని వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. అలాగే..

Miss World Contestants: వరంగల్ పర్యటనకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్..
Miss World Contestants

హైదరాబాద్: మిస్‌వరల్డ్‌ పోటీదారులు (Miss World contestants) బుధవారం ఓరుగల్లు (Warangal) పర్యటనకు (Visit) రానున్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్‌ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్ప సంపదను పరిశీలిస్తుంది. కాగా, 22 మంది అందగత్తెలతో కూడిన మరో బృందం హైదరాబాద్‌ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి (Ramappa Temple)చేరుకుని.. అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి హరిత కాటేజీల్లో డిన్నర్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.


పలు దర్శనీయ ప్రాంతాల సందర్శన..

బుధవారం అందాల భామలు వరంగల్, ములుగు జిల్లాలో పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. 35 మందితో కూడిన సుందరీమణులతో కూడిన ఒక బృందం వరంగల్ నగరంలోని వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. అలాగే 22 మంది అందగత్తెలతో కూడిన మరో బృందం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని... అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. మిస్​ వరల్డ్​ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణ... జరూర్​ ఆనా.. అనే థీమ్​‌తో ప్రభుత్వం అందాల భామలు ప్రాచీన ఆలయాలు.. పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ప్రణాళిక రూపొందించింది.

Also Read: YCP: మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా


ములుగు జిల్లా: అందెగత్తెల బృందం బుధవారం సాయంత్రం 4 గంటలకు ములుగు హరిత హోటల్‌కు చేరుకుంటుంది. రామప్ప దర్శనం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. రాత్రి 8 గంటలకు విందు.. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం అక్కర్లేదు

For More AP News and Telugu News

Updated Date - May 14 , 2025 | 02:33 PM