Hyderabad: 9వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Jun 07 , 2025 | 10:28 AM
9వ తేదీ సాయంత్రం వరకు నగరంలోని కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

- ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో
- నేటి నుంచి 9వ తేదీ వరకు
- చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో..
హైదరాబాద్ సిటీ: చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్(Nampally Exhibition Grounds) పరిసరాల్లో 7వ తేదీ సాయంత్రం నుంచి 9వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై సాధారణ వాహనాలకు అనుమతి ఉండదన్నారు.
సిద్ది అంబర్ బజార్ మసీదు నుంచి ఎంజే మార్కెట్, పుత్లీబౌలి, గాంధీ భవన్ వైపునకు భారీ వాహనాలను అనుమతించరు. చేప ప్రసాదం కోసం వచ్చే వారు తమ వాహనాలను గృహకల్ప, గగన్విహార్(Gaganvihar), చంద్రవిహార్ పార్కింగ్లలో నిలుపుకోవాలి. బస్, ఇతర వాహనాల్లో వచ్చే వారిని గాంధీభవన్ బస్స్టాప్ నుంచి గేట్ నంబర్ 2 నుంచి అనుమతిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News and National News