Share News

Adilabad: రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగిన ఆదివాసీ మహిళ

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:24 AM

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండల కేంద్రంలోని తొడసం వంశస్థుల ఆరాధ్య దైవమైన ఖాందేవుని జాతర ప్రతీఏడాది జనవరిలో సంక్రాంతి రోజున మొదలవుతుంది.

Adilabad: రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగిన ఆదివాసీ మహిళ

  • మొక్కు తీర్చుకున్న తొడసం ఆడపడుచు

నార్నూర్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండల కేంద్రంలోని తొడసం వంశస్థుల ఆరాధ్య దైవమైన ఖాందేవుని జాతర ప్రతీఏడాది జనవరిలో సంక్రాంతి రోజున మొదలవుతుంది. ఈ జాతరలో తొడసం వంశానికి చెందిన ఆడబిడ్డ నాగుబాయి చందు మంగళవారం రెండున్నర కిలో నువ్వుల నూనె తాగి మొక్కును తీర్చుకుంది. తొడసం వంశస్థుల ఇళ్ల నుంచి పూజకు నూనెను సేకరిస్తారు.


ఈ నూనెను ఆ వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం. ఈ జాతరకు మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జనాలు వస్తారు.

Updated Date - Jan 16 , 2025 | 04:24 AM